
బ్యాడ్మింటన్లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారి ఆసియా చాంపియన్షిప్ టైటిల్ కైవసం
ఈ వార్తాకథనం ఏంటి
Badminton Asia Team Championships 2024: భారత మహిళల జట్టు తొలిసారి ఆసియా చాంపియన్షిప్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
మలేషియాలోని సెలంగోర్లో ఆదివారం ఛాంపియన్షిప్ టైటిల్ ఫైనల్ జరిగింది.
క్రీడా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.
ఫైనల్ మ్యాచ్లో భారత్ 3-2తో థాయ్లాండ్ను ఓడించి ఈ ఘనత సాధించింది.
పీవీ సింధు, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ, టీనేజ్ సంచలనం అన్మోల్ ఖర్బ్ తమ సత్తా చాటడంతో ఫైనల్లో భారత్ 3-2తో విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రతిష్టాత్మకమైన థామస్ కప్ను గెలుచుకున్న రెండేళ్ల తర్వాత, ఖండాంతర టోర్నమెంట్లో భారత్ అద్భుతంగా రాణించి, చైనా, హాంకాంగ్, జపాన్, థాయ్లాండ్లను మట్టికరిపించి ఈ టైటిల్ను సొంతం చేసుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చరిత్ర సృష్టించిన మహిళలు
STOP PRESS: Our girls have created HISTORY 🔥🔥🔥
— India_AllSports (@India_AllSports) February 18, 2024
India WIN their MAIDEN Badminton Asia Team Championships TITLE after beating Thailand 3-2 in Final.
17 yrs young & rising star (WR 472) Anmol Kharb stunned WR 45 shuttler 21-14, 21-9 in the decider. #BATC2024 pic.twitter.com/BbaFpFTYkl