వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరొక పాయింట్
ఆసియా కప్లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ రద్దయ్యింది. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ మొదలు కాకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ దక్కింది. దీంతో పాక్ ఇప్పటి వరకు ఈ సిరిస్లో రెండు మ్యాచ్లు ఆడి మూడు పాయింట్లతో సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించింది. టీమిండియా ఖాతాలో ప్రస్తుతం ఒక పాయింట్ మాత్రమే ఉంది. ఈ క్రమంలో టీమిండియా సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించాలంటే, సెప్టెంబర్ 4న జరిగే నేపాల్తో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266/10 పరుగులు చేసింది.