LOADING...
IND vs SA: భారత స్పిన్నర్ల విజృంభణ.. రెండో రోజు ముగిసిన ఆట
భారత స్పిన్నర్ల విజృంభణ.. రెండో రోజు ముగిసిన ఆట

IND vs SA: భారత స్పిన్నర్ల విజృంభణ.. రెండో రోజు ముగిసిన ఆట

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, సౌతాఫ్రికా (IND vs SA) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన భారత జట్టు, బౌలింగ్‌లో మాత్రం అదరగొడుతోంది. భారత్ స్పిన్నర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. రెండో రోజు ముగిసే సమయానికి, సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్‌లో 93/7 స్కోరుతో నిలిచి, భారత్‌పై 63 పరుగుల ఆధిక్యం సాధించింది. క్రీజులో కోర్బిన్ బాష్ 1, తెంబా బావుమా 29 ఉంటున్నారు. బౌలింగ్‌లో, రవీంద్ర జడేజా 4/28తో విజృంభించాడు. అదనంగా, కుల్‌దీప్ యాదవ్ 2 వికెట్లు మరియు అక్షర్ పటేల్ 1 వికెట్ సాధించారు. భారత స్పిన్నర్ల ధాటికి సఫారీ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది.

Advertisement