Loading...
Team India: టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. రెండో వన్డేకు గిల్‌ ఆడతాడా?
టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. రెండో వన్డేకు గిల్‌ ఆడతాడా?

Team India: టీమిండియాను వెంటాడుతున్న గాయాలు.. రెండో వన్డేకు గిల్‌ ఆడతాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2026
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్‌ పర్యటనలో తొలి వన్డే విజయంతో ఊపుమీద ఉన్న టీమిండియాను ఇప్పుడు గాయాల సమస్య కలవరపెడుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమవగా, ఇప్పుడు మరో ముగ్గురు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కూడా ఆందోళన కలిగిస్తోంది. తొలి వన్డే సందర్భంగా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ మ్యాచ్‌ మధ్యలోనే మైదానం వీడగా, శ్రేయస్‌ అయ్యర్‌కు కూడా ఫీల్డింగ్‌ సమయంలో అసౌకర్యం కలగడంతో ఫిజియో చికిత్స అందించాల్సి వచ్చింది. దీంతో టీమిండియా ఇంజూరీ మేనేజ్‌మెంట్‌ మరోసారి చర్చనీయాంశమైంది.

వివరాలు

గిల్‌ రిటైర్డ్‌ హర్ట్‌.. బ్రార్‌ స్పెల్‌ పూర్తి చేయలేకపోయాడు

వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందే హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి గాయాలతో జట్టుకు దూరమయ్యారు.

ఇప్పుడు తొలి వన్డేలోనే మరో ఇద్దరు ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవడం ఆందోళన కలిగిస్తోంది.

పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ ఆరంభంలో కొంత ఖరీదైన బౌలింగ్‌ చేసినప్పటికీ, తర్వాత చక్కగా పుంజుకుని రెండు కీలక వికెట్లు తీశాడు. మొత్తం 9 ఓవర్లు బౌలింగ్‌ చేసి 61 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

ఒకే ఓవర్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్లిద్దరినీ ఔట్‌ చేసి భారత్‌కు కీలక బ్రేక్‌ ఇచ్చాడు. అయితే తన పదో ఓవర్‌ వేయడానికి పరుగెత్తే సమయంలో కాలి నొప్పితో ఒక్కసారిగా ఆగిపోయాడు.

ఫిజియో చికిత్స అందించినప్పటికీ బౌలింగ్‌ కొనసాగించలేక మైదానం వీడాల్సి వచ్చింది.

వివరాలు

సెంచరీ దిశగా సాగిన గిల్‌ ఇన్నింగ్స్‌కు గాయం బ్రేక్

సీనియర్‌ బ్యాటర్లు విఫలమైన వేళ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేశాడు.

ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన అతడు, తర్వాత వేగం పెంచి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అజేయంగా 80 పరుగులతో జట్టును విజయానికి చేరువ చేసిన గిల్‌ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు.

అయితే మ్యాచ్‌ చివరి దశలో తొడ కండరాలు పట్టేయడంతో అతడు నిలబడటానికే ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్‌ను కొనసాగించలేని పరిస్థితి రావడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా డగౌట్‌కు వెళ్లిపోయాడు.

ADVERTISEMENT

వివరాలు

రెండో వన్డేకు అందుబాటులో ఉంటారా?

భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో వన్డే గురువారం కార్డిఫ్‌లో జరగనుంది. తొలి మ్యాచ్‌ ముగిసిన ఒక్క రోజు వ్యవధిలోనే మరో 50 ఓవర్ల మ్యాచ్‌ ఉండటంతో గిల్‌, గుర్నూర్‌ బ్రార్‌ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత నెలకొంది.

ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఈ ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే రెండో వన్డేలో వీరిద్దరూ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

గాయం తీవ్రంగా ఉంటే ఇప్పటివరకు బోర్డు నుంచి ప్రకటన వచ్చి ఉండేదని వారు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

రోహిత్‌, కోహ్లీపై మరోసారి ఫోకస్

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ముగ్గురు సీనియర్‌ ఆటగాళ్లు బరిలోకి దిగారు.

జస్‌ప్రీత్‌ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ను ఔట్‌ చేసి ఆకట్టుకున్నాడు.

అయితే విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మాత్రం మరోసారి నిరాశపరిచారు. వన్డే ప్రపంచకప్‌కు కీలక సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్‌లో వీరిద్దరూ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది.

కార్డిఫ్‌లో జరిగే రెండో వన్డేలో రోహిత్‌, కోహ్లీ ఎలా రాణిస్తారన్నదే ఇప్పుడు అభిమానుల ఆసక్తిగా మారింది.

ADVERTISEMENT