LOADING...
IPL 2026: బీసీసీఐ కొత్త రూల్స్.. ఐపీఎల్‌లో షాకింగ్ నియమాలు
బీసీసీఐ కొత్త రూల్స్..ఐపీఎల్‌లో షాకింగ్ నియమాలు

IPL 2026: బీసీసీఐ కొత్త రూల్స్.. ఐపీఎల్‌లో షాకింగ్ నియమాలు

వ్రాసిన వారు Moogati Shabari
Mar 24, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. టోర్నీ ప్రారంభానికి ముందు నుంచే జట్లు పాటించాల్సిన సాధన విధానాలు, పిచ్ నిర్వహణపై కఠినమైన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా మ్యాచ్ జరిగే రోజుల్లో ఎలాంటి ప్రాక్టీస్ సెషన్‌లు నిర్వహించడానికి అనుమతి ఉండదని స్పష్టంగా పేర్కొంది.

వివరాలు

కొత్త రూల్స్ ఏంటంటే..

ఏ జట్టు అయినా సాధన సమయంలో ప్రత్యర్థి జట్టు ఉపయోగించిన పిచ్‌లు లేదా నెట్‌లను వినియోగించకూడదు. ప్రతి సాధన సెషన్ కోసం కొత్తగా సిద్ధం చేసిన పిచ్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు, ఉదయం ఒక జట్టు ఉపయోగించిన పిచ్‌ను సాయంత్రం మరొక జట్టు ఉపయోగించడానికి అనుమతి లేదు. అలాగే, ఒక జట్టు ఉపయోగించిన నెట్‌లను వెంటనే మరొక జట్టుకు ఇవ్వకూడదు. మ్యాచ్ జరిగే రోజుల్లో ప్రాక్టీస్‌కు పూర్తిగా నిషేధం విధించబడింది. అదే విధంగా, ఆ రోజు ప్రధాన మైదానంలో ఎలాంటి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించరాదు. ప్రాక్టీస్ జరిగే రోజుల్లో (ప్రీ-టోర్నమెంట్, టోర్నీ సమయంలో) గుర్తింపు పొందిన సిబ్బందికే డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోకి ప్రవేశం ఉంటుంది.

వివరాలు

వాటికి ఇక నో ఛాన్స్..

ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు జట్టుతో కలిసి ప్రయాణించకుండా వేరే వాహనాల్లో రావాలి. వారికి హాస్పిటాలిటీ ప్రాంతం నుంచి ప్రాక్టీస్‌ను వీక్షించే అవకాశం కల్పిస్తారు. అదనపు సపోర్ట్ స్టాఫ్ (త్రో డౌన్ స్పెషలిస్టులు, నెట్ బౌలర్లు) వివరాలను ముందుగానే బీసీసీఐకి సమర్పించాలి. వారి పేర్లు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే వారికి ఐడీ కార్డులు జారీ చేయబడతాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు హాజరయ్యేటప్పుడు తప్పనిసరిగా టీమ్ బస్సును ఉపయోగించాలి. అవసరమైతే జట్లు రెండు గ్రూపులుగా ప్రయాణించవచ్చు. మ్యాచ్ రోజున ప్రాక్టీస్ లేదా ఫిట్‌నెస్ టెస్ట్‌కు సంబంధించిన ఏ అభ్యర్థన ఉన్నా, ముందుగా స్థానిక మేనేజర్‌ను సంప్రదించాలి.

Advertisement

వివరాలు

మ్యాచ్ రోజుకు సంబంధించిన నియమాలివే..

పీఎంఓఏ ద్వారా గుర్తింపు పొందిన సిబ్బంది మ్యాచ్ రోజున తమ ఐడీ కార్డును వెంట తీసుకురావడం తప్పనిసరి. మొదటిసారి మర్చిపోతే హెచ్చరిక ఇస్తారు. కానీ రెండోసారి అదే తప్పు పునరావృతమైతే జట్టుకు జరిమానా విధించబడుతుంది. ఆటగాళ్లు నారింజ లేదా ఊదా రంగు క్యాప్‌లు ధరించాలి. ఒకవేళ ధరించకపోతే, టీవీ ప్రసారంలో కనిపించే మొదటి రెండు ఓవర్ల పాటు వాటిని తప్పనిసరిగా ధరించాలి. మ్యాచ్ అనంతరం జరిగే బహుమతి కార్యక్రమంలో ఆటగాళ్లు ఫ్లాపీలు లేదా స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించకూడదు. ఈ నియమాన్ని అతిక్రమిస్తే మొదట హెచ్చరిక, తర్వాత జరిమానా విధిస్తారు. ఐపీఎల్ 2025 తరహాలోనే, మ్యాచ్ రోజుల్లో టీమ్ డాక్టర్ సహా గరిష్టంగా 12 మంది గుర్తింపు పొందిన సపోర్ట్ స్టాఫ్‌కే అనుమతి ఉంటుంది.

Advertisement