LOADING...
IPL 2026 : SRH అభిమానులకు గుడ్‌న్యూస్.. యార్కర్ల స్పెషలిస్ట్ మలింగ రీఎంట్రీ
SRH అభిమానులకు గుడ్‌న్యూస్.. యార్కర్ల స్పెషలిస్ట్ మలింగ రీఎంట్రీ

IPL 2026 : SRH అభిమానులకు గుడ్‌న్యూస్.. యార్కర్ల స్పెషలిస్ట్ మలింగ రీఎంట్రీ

వ్రాసిన వారు Moogati Shabari
Mar 24, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్-2026 మ్యాచులు మార్చి 28న ప్రారంభం కానున్నాయి. ఈసారి టైటిల్ గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) కూడా విజేతగా నిలవాలనే ఉద్దేశంతో కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో టోర్నీ ఆరంభానికి ముందే ఆ జట్టుకు ఓ సంతోషకరమైన వార్త వచ్చింది. శ్రీలంకకు చెందిన స్టార్ ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగ త్వరలో జట్టుతో కలవనున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మలింగ గాయపడిన విషయం తెలిసిందే. ఆ గాయం కారణంగా అతను టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. అదే కారణంతో ఐపీఎల్-2026 సీజన్‌కూ అందుబాటులో ఉండకపోవచ్చని ముందుగా భావించారు.

వివరాలు

జట్టుకు మరింత బలం..

కానీ తాజా సమాచారం ప్రకారం, మలింగ తిరిగి ఫిట్‌నెస్ సాధించి ఎస్ఆర్‌హెచ్ జట్టులో చేరేందుకు సిద్ధమయ్యాడు. మరికొన్ని రోజుల్లోనే అతను జట్టుతో చేరనున్నాడు. ఫిట్‌నెస్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన మలింగకు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) కూడా లభించింది. తన ప్రత్యేకమైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టడంలో మలింగకు మంచి పేరు ఉంది. అతని చేరికతో ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ దళం మరింత బలపడనుంది. గత సీజన్‌లో అతను కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు సాధించి తన ప్రతిభను నిరూపించాడు.

వివరాలు

రసవత్తరంగా తొలి మ్యాచ్..

ఇక ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు జట్టు కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండరని యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. అందువల్ల తాత్కాలిక కెప్టెన్‌గా భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను నియమించారు. కమిన్స్ లేని లోటును బౌలింగ్ విభాగంలో మలింగ భర్తీ చేయనున్నాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్-2026 తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఈ పోటీ జరగనుంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement