IPL 2026 Playoffs Race: ముంబై,లక్నో తర్వాత ప్రమాదంలో మరో నాలుగు జట్లు.. ఆ జట్టు పరిస్థితి చూసి అభిమానులు షాక్..!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు రోజురోజుకూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్ల తర్వాత పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించగా, మరో పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఈ ఫలితాలతో కొన్ని జట్ల ఆశలు బలపడగా, మరికొన్ని జట్ల అవకాశాలు దాదాపు ముగిసిపోయాయి.
వివరాలు
ప్లేఆఫ్స్ ఆశలు కోల్పోయిన ముంబై, లక్నో
ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్తో పాటు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటపడ్డాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేశాయి. ఎనిమిది పరాజయాలతో తీవ్రంగా వెనుకబడ్డాయి. మిగిలిన మూడు మ్యాచ్ల్లో గెలిచినా గరిష్టంగా 12 పాయింట్లకే పరిమితమవుతాయి. దీంతో అర్హత అవకాశాలు పూర్తిగా ముగిశాయి. ప్రమాదంలో ఉన్న ఆ 4 జట్లు ఇవే..! ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే కనీసం 14 నుంచి 16 పాయింట్లు అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని జట్లు ఇప్పుడు ప్రతి మ్యాచ్ను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి.
వివరాలు
ప్రమాదంలో ఉన్న ఆ 4 జట్లు ఇవే..!
ఢిల్లీ క్యాపిటల్స్కు మిగిలిన మూడు మ్యాచ్లు అత్యంత కీలకంగా మారాయి. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఆ మూడు మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. ఒక్క మ్యాచ్లో ఓడినా అవకాశాలు దాదాపు ముగిసినట్టే. ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అయితే ఇందులో ఒక్క మ్యాచ్లోనైనా ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్లేఆఫ్స్లో చోటు సంపాదించాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క పరాజయం కూడా వారి అవకాశాలను దెబ్బతీయొచ్చు.
వివరాలు
టాప్-4 రేసులో దూసుకుపోతున్న జట్లు..
ప్రస్తుత ప్రదర్శన, పాయింట్ల పట్టికను పరిశీలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్స్ రేసులో బలంగా కనిపిస్తున్నాయి. అద్భుతమైన నెట్ రన్రేట్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకునే అవకాశాలను బలంగా నిలబెట్టుకుంది. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 21 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా స్థిరమైన ప్రదర్శనతో టాప్-4లో స్థానం ఖాయం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ బెర్త్ కోసం బలమైన పోటీదారులుగా కనిపిస్తున్నాయి.