IPL 2026: ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ విజయం.. ప్లేఆఫ్స్కు అర్హత
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో వాంఖడే స్టేడియంలో జరిగిన లీగ్ దశ చివరి ముందు మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) జట్టు ముంబయి ఇండియన్స్ (ఎంఐ)పై విజయం సాధించింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ తమ సీజన్ను నాలుగు విజయాలతో ముగించగా, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు చేరిన నాలుగో, చివరి జట్టుగా నిలిచింది. మరోవైపు, తొలి ఏడు మ్యాచ్ల్లో అపజయం తెలియకుండా దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) టోర్నీ నుంచి నిష్క్రమించింది. అలాగే, జోఫ్రా ఆర్చర్ అద్భుత ఆల్రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ 205 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది.
వివరాలు
ముంబై ఛేజ్కు దారుణ ఆరంభం
205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ప్రారంభం నుంచే షాక్లు తగిలాయి. మొదటి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ రోహిత్ శర్మను ఔట్ చేశాడు. తదుపరి ఓవర్లో నమన్ ధీర్ను కూడా పెవిలియన్కు పంపాడు. పవర్ప్లేలోనే ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ వికెట్లు కోల్పోయిన ముంబై 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, విల్ జాక్స్ మరియు సూర్యకుమార్ యాదవ్ ఎదురుదాడితో జట్టును మళ్లీ పోటీలోకి తీసుకువచ్చారు. విల్ జాక్స్ 18 బంతుల్లో 33 పరుగులు చేసి యశ్ రాజ్ పుంజా బౌలింగ్లో ఔటయ్యాడు.
వివరాలు
హార్దిక్ - సూర్యకుమార్ భాగస్వామ్యం..
జాక్స్ ఔటైన తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడుతూ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా యశ్ రాజ్ పుంజా, రవీంద్ర జడేజాపై దూకుడుగా ఆడుతూ హార్దిక్కు మంచి సహకారం అందించాడు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ తన అర్ధ సెంచరీల నిరీక్షణకు తెరదించి సీజన్లో రెండో ఫిఫ్టీ నమోదు చేశాడు. అతడు కేవలం 32 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. అయితే, 15 బంతుల్లో 34 పరుగులు చేసి వేగంగా ఆడుతున్న హార్దిక్ పాండ్యాను 16వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ ఔట్ చేసి ముంబైకి మరో భారీ దెబ్బ ఇచ్చాడు.
వివరాలు
సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డులు..
ఈ ఇన్నింగ్స్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున టీ20 క్రికెట్లో (ఐపీఎల్, సీఎల్టీ20 కలిపి) 4000కిపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో 6,432 పరుగులతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే, వాంఖడే స్టేడియంలో ఐపీఎల్లో 1,500 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్గా కూడా సూర్యకుమార్ నిలిచాడు. ఈ వేదికపై 2,632 పరుగులతో రోహిత్ శర్మ మాత్రమే అతనికంటే ముందున్నాడు.
వివరాలు
రాజస్థాన్ వరుస మెరుపులు..
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో బాగా ఆడుతున్న ధ్రువ్ జురెల్ను 13వ ఓవర్లో కార్బిన్ బోష్ ఔట్ చేశాడు. అదే సమయంలో డోనోవన్ ఫెరెరా త్వరగా ఔటవడంతో ఆర్ఆర్ స్కోరు 139/6గా మారింది. అయితే, జోఫ్రా ఆర్చర్ 15 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టును 170 పరుగుల దాటించాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రవీంద్ర జడేజా 11 బంతుల్లో అజేయంగా 19 పరుగులు చేశాడు. చివర్లో నాండ్రే బర్గర్ కేవలం మూడు బంతుల్లో 10 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ 205/8 స్కోరు సాధించింది. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు తీశారు.