IPL 2026: రూ.16,706 కోట్లకు ఆర్సీబీ అమ్మకం.. కొత్త ఓనర్లు ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్సీబీ జట్టుకు యాజమాన్యం మారడం ఐపీఎల్ చరిత్రలో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొత్త చేతుల్లోకి వెళ్లడం వ్యాపారపరంగా కూడా పెద్ద ఒప్పందంగా నిలిచింది. ఈ జట్టును రూ.16,706 కోట్ల భారీ ధరకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ కలిసి కొనుగోలు చేయడం విశేషం. ముందుగా ఈ జట్టును డియాజియో సంస్థ నిర్వహించింది. ఈ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్కు మాతృసంస్థగా వ్యవహరించింది. 2008లో ఐపీఎల్ ప్రారంభ సమయంలో విజయ్ మాల్యా యూబీ గ్రూప్ తరఫున బెంగళూరు జట్టును సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో ఈ జట్టు భారీ అంచనాలతో రంగంలోకి దిగింది.
వివరాలు
ఆటగాళ్ల ఎంపికలో కొత్త వ్యూహాలు..
అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా మాల్యా తన వ్యాపారాలను కోల్పోవడంతో, యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా డియాజియో ఆ జట్టును తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు డియాజియో సంస్థ తన వాటాను విక్రయించాలని నిర్ణయించడంతో, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఫ్రాంచైజీని కొనుగోలు చేశాయి. ఈ మార్పు వల్ల జట్టు నిర్వహణ, మార్కెటింగ్, ఆటగాళ్ల ఎంపికలో కొత్త వ్యూహాలు అమలు అయ్యే అవకాశం ఉంది. అభిమానులకు మరింత ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించేందుకు కొత్త యాజమాన్యం ప్రయత్నించే అవకాశముంది.
వివరాలు
బలపడనున్న ఆర్సీబీ...
ఇక ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ను ఎదుర్కొననుంది. గత సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ, ఈసారి కొత్త యాజమాన్యంతో మరోసారి టైటిల్ కోసం బరిలోకి దిగనుంది. కొత్త మార్పులతో జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో అన్నది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. మరి కోహ్లీ కూడా ఈ సీజన్లో మంచి ఫామ్తో ఉండి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించనున్నాడు.