LOADING...
IPL: ఐపీఎల్‌కు మూడో స్థానం.. డబ్ల్యూసీఏ ర్యాంకులపై ఫ్యాన్స్ ఆగ్రహం
ఐపీఎల్‌కు మూడో స్థానం.. డబ్ల్యూసీఏ ర్యాంకులపై ఫ్యాన్స్ ఆగ్రహం

IPL: ఐపీఎల్‌కు మూడో స్థానం.. డబ్ల్యూసీఏ ర్యాంకులపై ఫ్యాన్స్ ఆగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ20 లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం దక్కడం చర్చనీయాంశమైంది. దీనిపై సోషల్ మీడియాలో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్‌లో ఆటగాళ్లు పొందే పారితోషికం ఇతర లీగ్‌లతో పోలిస్తే భారీగా ఉన్నప్పటికీ దానికంటే తక్కువ వేతనాలు ఉన్న ది హండ్రెడ్కు మొదటి స్థానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల ముగిసిన ఈ లీగ్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడికి సుమారు రూ.4.81 కోట్లు మాత్రమే దక్కాయి.

Details

అభిమానుల అసంతృప్తి

ఇక ఐపీఎల్‌లో మాత్రం భారీ మొత్తాలు ఖర్చు చేస్తున్నారు. ఉదాహరణకు కామెరూన్ గ్రీన్ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. అదే విధంగా దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్‌ఏ20 లీగ్‌కు రెండో స్థానం దక్కగా, అక్కడ టాప్ ప్లేయర్‌కు వచ్చిన మొత్తం సుమారు రూ.8.3 కోట్లే. ఇది ఐపీఎల్‌లో దేశీయ ఆటగాళ్లు పొందిన రూ.12.40 కోట్ల కంటే కూడా తక్కువ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తక్కువ పారితోషికం ఉన్న లీగ్‌లకు పైస్థానాలు, అత్యధిక డబ్బు చెల్లించే ఐపీఎల్‌కు మూడో స్థానం ఇవ్వడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Details

ర్యాంకింగ్స్ ఎలా నిర్ణయించారంటే…

డబ్ల్యూసీఏ ఈ ర్యాంకులను ప్రకటించేందుకు పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఆటగాళ్ల జీతభత్యాలు, భద్రత, హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన ప్రమాణాలు వంటి అంశాల ఆధారంగా మొత్తం 100 పాయింట్లలో స్కోర్ కేటాయించింది. ఆటగాళ్లు, వారి అసోసియేషన్లు, ఏజెంట్ల నుంచి సర్వే ఫీడ్‌బ్యాక్ సేకరించి ఈ ర్యాంకులను రూపొందించింది. లీగ్‌ల ర్యాంకులు ఇలా ఉన్నాయి ది హండ్రెడ్ - 75.2 ఎస్‌ఏ20 - 68.0 ఐపీఎల్ - 62.6 బిగ్‌బాష్ లీగ్ - 62.5 పీఎస్‌ఎల్ - 48.0 మేజర్ లీగ్ క్రికెట్ - 43.0 ఐఎల్‌టీ20 - 39.1 సీపీఎల్ - 38.9 అబుదాబి టీ10 - 30.1 బీపీఎల్ - 22.6

Advertisement

Details

ఐపీఎల్‌కు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి?

ఆటగాళ్లకు చెల్లింపులు, ఆర్థిక బలం విషయంలో ఐపీఎల్‌కు పూర్తి మార్కులు దక్కినప్పటికీ, ఆటగాళ్ల హక్కుల పరిరక్షణ అంశంలో తక్కువ స్కోర్ వచ్చింది. ఈ విభాగంలో ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూసీఏ అభిప్రాయపడింది. డబ్ల్యూసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ మోఫాట్ మాట్లాడుతూ.. ఈ ర్యాంకుల ఉద్దేశం ఏ లీగ్‌ను తక్కువ చేసి చూపడం కాదని, వాటిని మరింత మెరుగుపరచడానికి మార్గనిర్దేశం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

Advertisement