Page Loader
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ 
ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ అభిమానుల కోసం బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం సాయంత్రం అధికారికంగా విడుదల చేసింది. 2025 సీజన్ ప్రారంభం వచ్చే మార్చి 21వ తేదీ నుంచి జరుగుతుండగా, ఫైనల్ మ్యాచ్ మే 25వ తేదీన జరగనుంది. గతంలో బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను ఎప్పుడైనా చివరి నిమిషంలో విడుదల చేసినా, ఈసారి మాత్రం ఆ ఆనవాయితీని పరిగణలోకి తీసుకుని రెండు నెలల ముందుగానే షెడ్యూల్‌ను ప్రకటించింది.

Details

రికార్డు ధర పలికిన రిషబ్ పంత్

ఇది అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌తో ఐపీఎల్ షెడ్యూల్ సంబంధించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవలే దుబాయ్‌లో ఐపీఎల్ మెగా వేలం జరిగింది. ఈ వేలంలో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌ భారీ ధరలకు అమ్ముడయ్యారు. రిషబ్ పంత్ 27 కోట్లు ధర పెట్టి అత్యధిక ధరను పలికారు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ (26.75 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (23.75 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.