NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు!
    తదుపరి వార్తా కథనం
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు!
    ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు!

    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ మధ్యలోనే నిలిచిపోయింది.

    పాక్ దాడుల భయంతో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, భద్రతాపరమైన కారణాలతో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

    మ్యాచ్‌ నిలిపివేయడం క్రమంలో, బీసీసీఐ వెంటనే చర్యలు తీసుకుంది. ఇరుజట్ల ఆటగాళ్లు, కామెంటేటర్లు, బ్రాడ్‌కాస్టింగ్‌ సిబ్బంది తదితరులను ధర్మశాల నుంచి ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేక వందే భారత్‌ హైస్పీడ్‌ రైలును ఏర్పాటు చేసింది.

    దాదాపు 300 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు బీసీసీఐని ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది.

    Details

    ప్రేక్షకులను సురక్షితంగా తరలించిన సిబ్బంది

    గురువారం టాస్‌ గెలిచిన పంజాబ్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా, వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ భద్రతాపరమైన కారణాలతో ప్లడ్ లైట్లు ఆగిపోవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.

    ఈ క్రమంలో టెక్నికల్‌ ఇష్యూలను కూడా బోర్డు స్పష్టంగా పేర్కొంది. దీంతో మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయక తప్పలేదు.

    తర్వాత స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను సురక్షితంగా తరలించి, మైదానాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్ ధుమాల్ ఆపరేషన్‌పై పర్యవేక్షణ కొనసాగించారు.

    ఈ ఘటన నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై భద్రతా దృష్టితో మరింత అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    ఐపీఎల్

    తాజా

    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్

    బీసీసీఐ

    IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ  ఐపీఎల్
    BCCI Pay Cuts: ఆటగాళ్ల పేమెంట్‌లో కోత.. టీమిండియా ఫలితాల నేపథ్యంలో బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం టీమిండియా
    BCCI: ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్‌ విషయంలో బీసీసీఐ కఠిన చర్యలు.. టీమిండియాలో మళ్లీ యో యో టెస్టు..!  క్రీడలు
    Kevin Pietersen: భారత జట్టులో మార్పులకు బీసీసీఐ శ్రీకారం.. గంభీర్‌ బృందంలోకి కెవిన్ పీటర్సన్ కెవిన్ పీటర్సన్

    ఐపీఎల్

    IPL 2025: ఐపీఎల్‌-18లో యువ ఆటగాళ్లు దూకుడుపై ప్రత్యేక కథనం క్రీడలు
    IPL 2025: 14 ఏళ్లలోనే ఐపీఎల్‌లో దుమ్మురేపిన వైభవ్.. అతని తర్వాత ఎవరున్నారంటే? క్రికెట్
    IPL 2025: ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘన.. గుజరాత్ కెప్టెన్‌పై చర్యలు గుజరాత్ టైటాన్స్
    RCB vs PBKS : తేలిపోయిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ లక్ష్యం ఎంతంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025