LOADING...
Sanju Samson for CSK: శాంసన్‌ సీఎస్కే జట్టులోకి చేరనున్నాడా? జడేజా, కరన్‌ రాజస్థాన్‌ వైపు అడుగులు!
శాంసన్‌ సీఎస్కే జట్టులోకి చేరనున్నాడా? జడేజా, కరన్‌ రాజస్థాన్‌ వైపు అడుగులు!

Sanju Samson for CSK: శాంసన్‌ సీఎస్కే జట్టులోకి చేరనున్నాడా? జడేజా, కరన్‌ రాజస్థాన్‌ వైపు అడుగులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంజు శాంసన్‌ (Sanju Samson) ఐపీఎల్‌ ట్రేడ్‌ వార్తలు మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, సంజూ శాంసన్‌ వచ్చే ఏడాది ఐపీఎల్‌ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్టుతో ఆడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం, ఈ ట్రేడ్‌ కోసం సీఎస్కే రవీంద్ర జడేజా (Ravindra Jadeja), సామ్‌ కరన్‌ (Sam Curran) లాంటి ఇద్దరు ఆల్‌రౌండర్లను రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)కు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ఫైనల్‌ అయితే, 17 సంవత్సరాల తర్వాత జడేజా మళ్లీ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టులోకి చేరనున్నాడు. విశ్వసనీయ వర్గాల ప్రకారం, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు యాజమాన్యాలు ఇప్పటికే ఈ అంశంపై చర్చలు జరిపాయి.

Details

అధికారిక ప్రకటన వెలువడలేదు

రవీంద్ర జడేజా, సంజూ శాంసన్‌, సామ్‌ కరన్‌ కూడా ట్రేడ్‌పై మాట్లాడినట్లు సమాచారం. ఒప్పందం దాదాపు పూర్తయిందని చెబుతుండగా, ఇంకా ఏ ఫ్రాంచైజీ అయినా అధికారిక ప్రకటన చేయలేదు. ట్రేడ్‌ను అధికారికంగా పూర్తి చేయాలంటే, రెండు ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు ఈ మార్పులపై సమాచారం అందించాలి. నిబంధనల ప్రకారం, ఆటగాళ్ల లిఖితపూర్వక సమ్మతి వచ్చిన తర్వాతే తుది ట్రేడ్‌ ఒప్పందం అమల్లోకి వస్తుంది. సంజూ శాంసన్‌, రవీంద్ర జడేజా ఇద్దరూ తమ తమ జట్లతో చాలా కాలంగా అనుబంధం కలిగి ఉన్నారు. శాంసన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున 11 సంవత్సరాలు గడిపాడు. మరోవైపు జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో 12 సీజన్లుగా ఉన్నాడు.

Details

 254 మ్యాచులాడిన జడేజా

తాను రాజస్థాన్‌ జట్టును వదిలి వెళ్లాలని భావిస్తున్నట్లు సంజూ శాంసన్‌ కొంతకాలం క్రితమే వెల్లడించాడు. జడేజా ఇప్పటివరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో 254 మ్యాచ్‌లు ఆడాడు. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోనీ, రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌ల తర్వాత అతడి పేరు ఉంది. సీఎస్కే తరఫున జడేజా 143 వికెట్లు తీశాడు, ఇది ఫ్రాంచైజీ రికార్డ్‌. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో సీఎస్కే జడేజాను కెప్టెన్‌గా నియమించింది. అయితే జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సీజన్‌ మధ్యలో జడేజా కెప్టెన్సీని ధోనికి తిరిగి అప్పగించాడు. ఫైనల్‌లో చివరి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా మలిచి సీఎస్కేకు విజయం అందించిన జడేజా ప్రదర్శన అభిమానుల మనసుల్లో ఇప్పటికీ నిలిచిపోయింది.