Ram charan: క్రికెట్ టీమ్ను కొనుగోలు చేసిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) ఒక క్రికెట్ టీమ్కు ఓనర్గా మారారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) పేరుతో గల్లీ క్రికెటర్ల కోసం ఒక లీగ్ను నిర్విహిస్తున్న విషయం తెలిసిందే. ISPL లిగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. అయితే ఈ లీగ్లో హైదరాబాద్ టీమ్కు రామ్ చరణ్ ఓనర్గా వ్వవహరిస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ISPL లిగ్ను టీ-10 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఇందులో ఆరు జట్లు ఆడనున్నాయి. ఈ లీగ్ మొత్తం ఏడు రోజుల పాటు జరగనుంది. మొత్తం 19మ్యాచ్లు జగనున్నాయి.