Loading...
Lalchand Rajput: మరో రెండేళ్లు నిరాటంకంగా ఆడే సత్తా రోహిత్‌కు ఉంది.. హిట్‌మ్యాన్‌పై తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ విశ్వాసం
మరో రెండేళ్లు నిరాటంకంగా ఆడే సత్తా రోహిత్‌కు ఉంది.. హిట్‌మ్యాన్‌పై తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ విశ్వాసం

Lalchand Rajput: మరో రెండేళ్లు నిరాటంకంగా ఆడే సత్తా రోహిత్‌కు ఉంది.. హిట్‌మ్యాన్‌పై తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ విశ్వాసం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, అతని సామర్థ్యంపై ఎలాంటి సందేహం అవసరం లేదని మాజీ క్రికెటర్, తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు. రోహిత్ కనీసం మరో రెండేళ్ల పాటు అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడగలడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఫామ్ సమస్యలు లేదా ఒత్తిడి, దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో సహజంగా ఎదురయ్యే అలసటలో భాగమేనని పేర్కొన్నారు.

వివరాలు

వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న బీసీసీఐ..

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు స్థానం లేదన్న ప్రచారం ఇటీవల ఊపందుకుంది.

అయితే అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో రాజ్‌పుత్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి.

నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న రోజుల నుంచే రోహిత్ ప్రతిభను దగ్గరగా గమనించిన రాజ్‌పుత్, అతని ఫిట్‌నెస్‌లో వచ్చిన మార్పులను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తన శారీరక దృఢత్వం కోసం రోహిత్ ఎంతో కష్టపడ్డాడని, ప్రస్తుతం గతంతో పోలిస్తే మరింత ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపిస్తున్నాడని అన్నారు.

వివరాలు

ప్రస్తుతం ఒకే ఫార్మాట్‌పై దృష్టి..

2027 ప్రపంచకప్ గురించి ఇప్పుడే అంచనాలు వేయడం సరైనది కాదని రాజ్‌పుత్ అభిప్రాయపడ్డారు.

రోహిత్ కూడా ఆ టోర్నీ వరకు కొనసాగాలనే లక్ష్యంతోనే కృషి చేస్తున్నాడని వెల్లడించారు.

ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ ప్రదర్శనపై స్పందిస్తూ, ఎన్నో సంవత్సరాల పాటు అత్యున్నత స్థాయిలో ఆడే ఆటగాళ్లకు గాయాలు, అలసట వంటి సమస్యలు సహజమని చెప్పారు.

అయినప్పటికీ ప్రతి సారి రోహిత్ మరింత బలంగా తిరిగి వచ్చాడని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఒకే ఫార్మాట్‌పై దృష్టి కేంద్రీకరించిన కారణంగా అతని బ్యాటింగ్ విధానంలో కూడా మార్పు కనిపిస్తోందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు

యువ క్రికెటర్లకు ఆదర్శం..

గతంలో మాదిరిగా వేగంగా పరుగులు చేయడమే కాకుండా, ఇప్పుడు ఇన్నింగ్స్‌ను నిలకడగా నిర్మించే దిశగా ఆడుతున్నాడని, త్వరలోనే మరో శతకంతో తన ఫామ్‌ను నిరూపిస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల ఉనికి భారత జట్టుకు అమూల్యమైన బలమని రాజ్‌పుత్ అన్నారు.

వీరిద్దరూ మైదానంలో ఉన్నంత మాత్రాన ప్రత్యర్థి జట్లపై మానసిక ఒత్తిడి ఏర్పడుతుందని, యువ క్రికెటర్లకు కూడా వీరే ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

ADVERTISEMENT