NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Bengaluru Vs Punjab: సొంత మైదానంలో బెంగళూరు విజయ పరంపర కొనసాగిస్తుందా? 
    తదుపరి వార్తా కథనం
    Bengaluru Vs Punjab: సొంత మైదానంలో బెంగళూరు విజయ పరంపర కొనసాగిస్తుందా? 

    Bengaluru Vs Punjab: సొంత మైదానంలో బెంగళూరు విజయ పరంపర కొనసాగిస్తుందా? 

    వ్రాసిన వారు Stalin
    Mar 25, 2024
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో జట్టు పంజాబ్ తో పోరుకు సిద్దమైంది.

    చెన్నైతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు జట్టు సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది.

    ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచులు విజేతలుగా నిలిచిన జట్ల సొంత మైదానాల్లోనే జరగడం విశేషం.

    అయితే ఈ రోజు బెంగళూరు - పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. హోమ్‌ గ్రౌండ్‌లో విక్టరీ ఆనవాయితీని బెంగళూరు కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి!

    ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో బెంగళూరు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై జట్టుతో జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ సరిగ్గా ప్రదర్శన చేయలేకపోయింది.

    చెన్నై తో బెంగళూరు తొలి మ్యాచ్ విశ్లేషణ

    చెన్నై తో బెంగళూరు తొలి మ్యాచ్ విశ్లేషణ

    స్టార్‌ విరాట్ కోహ్లీ తన దూకుడు చూపలేదు. కెప్టెన్ డుప్లెసిస్‌, దినేశ్ కార్తిక్, అనుజ్‌ రావత్ రాణించడంతో చెన్నై మ్యాచ్ 170+ స్కోరు చేయగలిగింది.

    కామెరూన్ గ్రీన్ సరిగ్గా ఆడలేకపోయాడు. ఆసీస్‌ను ప్రపంచ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన "గ్లెన్ మ్యాక్స్‌వెల్" (0) తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు.

    చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు 84 మ్యాచ్‌లు ఆడితే 39 మ్యాచుల్లో గెలిచింది, 40 మ్యాచుల్లో ఓడింది. ఐదు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. బౌలింగ్‌ లో మెరుగుదల అవసరం.

    సిరాజ్‌, అల్జారీ జోసెఫ్‌, కామెరూన్ గ్రీన్, కర్ణ్‌ శర్మ, యశ్‌ దయాల్ భారీగా పరుగులు సమర్పించకుండా ఉంటే ఫలితం ఉంటుంది.

    ఢిల్లీతో జరిగిన పంజాబ్‌ మ్యాచ్ విశ్లేషణ ... 

    ఢిల్లీతో జరిగిన పంజాబ్‌ మ్యాచ్ విశ్లేషణ 

    ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఒక దశలో ఓటమి దిశగా సాగింది, కానీ సామ్‌కరన్ (63), లివింగ్‌స్టోన్ (38) కీలకపాత్ర ద్వారా ఇన్నింగ్స్‌తో గట్టెక్కారు.

    గడిచిన రెండు సీజన్ల నుంచి విఫలమవుతున్న కరన్‌ మళ్ళీ ఊపందుకోవటం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం.

    కెప్టెన్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడిన భారీ స్కోరు చేయలేకపోయాడు. ఇక మూడు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన జానీ బెయిర్‌ స్టో (9)కి మ్యాచ్ కలిసిరాలేదు.

    కొత్త వైస్‌ కెప్టెన్‌ జితేశ్ శర్మ తేలిపోయాడు. దాదాపు రూ.11 కోట్లతో దక్కించుకున్న హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో గొప్ప ప్రదర్శన చేయలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఐపీఎల్

    ఫీల్డింగ్ సెట్ చేయడంలో ధోనీ మాస్టర్ మైండ్; వెంకటేష్ అయ్యర్ ప్రశంసలు  క్రికెట్
    భారీగా పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ విలువ.. దుమ్మురేపుతున్న చెన్నైసూపర్ కింగ్స్ క్రికెట్
    RCB: ఆర్సీబీ నూతన కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Sunrisers New Coach: సన్ రైజర్స్ కొత్త కోచ్‌గా కివీస్ లెజెండ్.. లారాకు గుడ్‌బై! సన్ రైజర్స్ హైదరాబాద్

    క్రికెట్

    Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్  రామ్ చరణ్
    Best Cricketers Of 2023: ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్లు వీళ్లే..! టీమిండియా
    WTC 2025: డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం టీమిండియా కసరత్తు టీమిండియా
    Afghanistan Cricketers: న‌వీన్ ఉల్ హాక్‌కు బిగ్ షాక్‌.. ముగ్గురు ఆటగాళ్లకు ఎన్‌వోసీ నిరాకరణ! ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025