Lionel Messi: శంషాబాద్ ఎయిర్ పోర్టులో లియోనల్ మెస్సీకి ఘన స్వాగతం
ఈ వార్తాకథనం ఏంటి
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Lionel Messi)శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్లనున్న మెస్సీ, అక్కడ వందమందితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 6.30గంటలకు మెస్సి బృందం ఉప్పల్ స్టేడియానికి చేరుకోనుంది. మెస్సీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోల్కతాలో ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమైన పోలీసులు బందోబస్తును మరింత పెంచారు. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా లియోనెల్ మెస్సి ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఫుట్బాల్ ఈవెంట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Details
మెస్సి పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది
రాత్రి 7.50 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సి - గోట్ ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రాత్రి 8.06 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లియోనెల్ మెస్సి మైదానంలోకి దిగనున్నారు. రాత్రి 8.08 గంటలకు రోడ్రిగో, లూయిస్ సువారెజ్ మైదానంలోకి ప్రవేశిస్తారు. రాత్రి 8.13 గంటలకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించనున్నారు. రాత్రి 8.18 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైదానంలోకి దిగనున్నారు.