LOADING...
IRE vs IND: 19 ఏళ్ల విరామం తర్వాత బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌లు.. ఐర్లాండ్‌తో భారత్ పోటీ!
19 ఏళ్ల విరామం తర్వాత బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌లు.. ఐర్లాండ్‌తో భారత్ పోటీ!

IRE vs IND: 19 ఏళ్ల విరామం తర్వాత బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌లు.. ఐర్లాండ్‌తో భారత్ పోటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఈ చిన్న సిరీస్‌ను భారత్ ఆడనుండటం విశేషం. ముఖ్యంగా దాదాపు 19 ఏళ్ల విరామం తర్వాత బెల్‌ఫాస్ట్ మైదానంలో భారత జట్టు మళ్లీ మ్యాచ్‌లు ఆడనుండటం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌, ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు తొలి విదేశీ పర్యటనగా ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్ ముగిసిన కొద్దిరోజుల్లోనే ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం టీమ్‌ఇండియా సిద్ధం కానుంది. మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది తొలి టీ20 మ్యాచ్‌: జూన్ 26 రెండో టీ20 మ్యాచ్‌: జూన్ 28

Details

స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్

ఈ సందర్భంగా బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఎనిమిదేళ్లలో భారత్ మూడుసార్లు ఐర్లాండ్ పర్యటన చేసింది. 2018, 2022, 2023ల్లో అక్కడ మ్యాచ్‌లు ఆడింది. అయితే 2007 తర్వాత బెల్‌ఫాస్ట్ వేదికగా ఇప్పుడు మాత్రమే మళ్లీ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక ఐపీఎల్ ముగిసిన అనంతరం, భారత్ స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ను కూడా ఆడనుంది.

Advertisement