
Lionel Messi: భారత్లో మెస్సి మ్యానియా.. కోల్కతాలో 70 అడుగుల విగ్రహం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఫుట్బాల్ అభిమానులకు ఇది సంతోషకరమైన విషయం. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. మొదట షెడ్యూల్ ప్రకారం మెస్సి భారత పర్యటనలో కోల్కతాకు చేరుకోనున్నారు. అనంతరం అహ్మదాబాద్, ముంబయి, ఢిల్లీ నగరాలను సందర్శించనున్నాడు. ఈ పర్యటన చివరగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మెస్సి పర్యటనకు సంబంధించి వాంఖడే స్టేడియం బుకింగ్ సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెస్సి కూడా సోషల్ మీడియా ఖాతా ద్వారా త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 12న రాత్రి 10 గంటలకు మెస్సి కోల్కతాలో అడుగుపెడతాడు. అక్కడ రెండు రోజులు గడుపుతాడు.
Details
భారీ విగ్రహ ఆవిష్కరణ
ఈ పర్యటనలో ఆయన ఎక్కువ సమయం కోల్కతాలోనే గడిపే అవకాశం ఉంది. డిసెంబరు 13న కోల్కతా VIP రోడ్లోని శ్రీభూమిలో 70 అడుగుల మెస్సి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నిర్వాహకుల ప్రకారం, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెస్సి విగ్రహంగా గుర్తింపు పొందనుంది. విగ్రహావిష్కరణ అనంతరం, మెస్సి ఈడెన్ గార్డెన్స్కు వెళ్లనున్నాడు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఈ ఈవెంట్లో మెస్సి, సౌరభ్ గంగూలీ, లియాండర్ పేస్, జాన్ అబ్రహం, భైచుంగ్ భుటియా తదితరులతో కలిసి 'సెవెన్ ఎ సైడ్' ఫన్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడు.
Details
మిగిలిన షెడ్యూల్ ఇలా
ఈ ఈవెంట్కి హాజరుకావాలంటే రూ.3,500 ప్రారంభ ధరతో టికెట్ కొనాల్సి వస్తుందని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెస్సి సుమారు గంట 20 నిమిషాలు ఉంటాడు. అంతేకాకుండా మెస్సిని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సన్మానించే అవకాశం ఉందని సమాచారం. డిసెంబరు 13 సాయంత్రం మెస్సి కోల్కతా నుంచి అహ్మదాబాద్కు బయల్దేరుతాడు. డిసెంబరు 14న ఆయన ముంబయికి చేరుకుంటాడు. ముంబయిలో ధోని, విరాట్ కోహ్లీతో కలిసి సెవెన్ ఎ సైడ్ క్రికెట్ ఆడతాడన్న వార్తలున్నాయి. అనంతరం డిసెంబరు 15న ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతాడు.