NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Champions Trophy 2025: పాకిస్థాన్‌లో స్టేడియాల ఆధునికీకరణ.. భారత్‌పై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Champions Trophy 2025: పాకిస్థాన్‌లో స్టేడియాల ఆధునికీకరణ.. భారత్‌పై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు
    పాకిస్థాన్‌లో స్టేడియాల ఆధునికీకరణ.. భారత్‌పై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

    Champions Trophy 2025: పాకిస్థాన్‌లో స్టేడియాల ఆధునికీకరణ.. భారత్‌పై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 01, 2025
    02:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోసిన్ నక్వీ, టీమ్ ఇండియాపై అనేక విమర్శలు చేశారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి మాట్లాడారు.

    ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి, పాకిస్థాన్‌లో స్టేడియాలు సిద్ధం కాలేకపోవడంపై వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో, నక్వీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

    ఐసీసీ విధించిన గడువులోగా, మైదానాలు సిద్ధం కావడం కష్టమని చెప్పిన వారిపై ఘాటు విమర్శలు చేశారు.

    ఫిబ్రవరి 7 నాటికి గడాఫీ స్టేడియం సిద్ధమవుతుందని నక్వీ ప్రకటించారు. బయట నుంచి చేసే వ్యాఖ్యలు తమ పరిధిని దాటి పోతున్నాయని, పాక్ క్రికెట్ బోర్డుపై అనవసరమైన ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.

    పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ తరలిపోతుందని కూడా చెప్పారన్నారు.

    Details

     అన్ని జట్లకూ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం

    అయినా పీసీబీ అధ్యక్షుడిగా తాను భరోసా ఇస్తున్నానన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కాదు, ట్రై సిరీస్‌ను కూడా విజయవంతంగా నిర్వహించగలమన్నారు.

    విమర్శలు ఎన్ని ఉన్నా వెనకడుగు వేయమని, పీసీబీ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, అన్ని జట్లకూ స్వాగతం పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారి భద్రత తమ బాధ్యత అని నక్వీ స్పష్టం చేశారు.

    ఫిబ్రవరి 16న లాహోర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.

    గత సంప్రదాయాలకు భిన్నంగా, ఈసారి కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్సులు, ఫొటోషూట్లు నిర్వహించవద్దని నిర్ణయించారు. ట్రావెలింగ్ షెడ్యూల్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    ప్రారంభోత్సవానికి, సభ్య దేశాల క్రీడా మంత్రులు, అధికారులను ఆహ్వానం పంపిస్తామని, భారత ప్రతినిధులు కూడా పాల్గొంటారని నక్వీ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ఐసీసీ

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    పాకిస్థాన్

    IND vs PAK: పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ వీసా నిరాకరణ.. ఎందుకంటే? ఐసీసీ
    Bus Falls Into River:పెళ్లి బస్సు నదిలో పడి 14 మంది మృతి.. ప్రాణాలతో బయటపడిన వధువు  అంతర్జాతీయం
    Imran Khan: సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదైన కేసులో.. పాకిస్థాన్‌ మాజీ ప్రధానికి ఊరట..  ఇమ్రాన్ ఖాన్
    Champions Trophy: నవంబర్ 16 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్‌ కవ్వింపు చర్యలు! క్రీడలు

    ఐసీసీ

    Sucessful Indian Coach : భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన ఐదుగురు కోచ్‌లు..ఎవరంటే..? క్రికెట్
    ICC: ICC కొత్త అధ్యక్షుడిగా జై షా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుండి మద్దతు - నివేదిక క్రీడలు
    ICC: ఐసీసీ కొత్త చైర్మన్‌గా జై షా.. క్రీడలు
    Jai Shah: గౌరవంగా ఉంది.. టెస్టు క్రికెట్‌పై జై షా కీలక వ్యాఖ్యలు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025