MI vs KKR : 14 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్పై ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 రెండవ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 14 ఏళ్లుగా తొలి మ్యాచ్లో పరాజయం పాలవుతున్న రికార్డును 2026 సీజన్లో ముంబై బ్రేక్ చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఇచ్చిన 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై అవలీలగా ఛేజ్ చేసింది. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ 148 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఈ ఛేజ్ను వన్-సైడ్గా పూర్తి చేశారు. రోహిత్ శర్మ 23 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించారు. మొత్తంగా 38 బంతుల్లో 78 పరుగులు చేసి 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.
వివరాలు
మూడు వికెట్లు పడగొట్టిన శార్దూల్ ఠాకూర్
రికెల్టన్ కేవలం 24 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేశారు. ముంబై మొదటి వికెట్ 12వ ఓవర్లో కోల్పోయింది, ఆ ఓవర్లో వైభవ్ అరోరా బౌలింగ్లో రోహిత్ ఒక భారీ షాట్ ఆడారు. ఆ బంతిని అనుకుల్ రాయ్ షార్ట్ మిడ్-వికెట్ నుంచి అద్భుతమైన డైవ్ క్యాచ్తో రక్షించారు. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అజింక్య రహానే 67 పరుగులు, రఘువంశీ 51 పరుగులు చేశారు. ముంబై తరపున శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. గాయంతో అజింక్య రహానే మైదానం వీడగా, రింకు సింగ్ కెప్టెన్సీ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆరు వికెట్ల తేడాతో గెలుపు
Sealed in style 🔒@mipaltan begin their #TATAIPL 2026 campaign with an impressive 6⃣-wicket victory at home 💙
— IndianPremierLeague (@IPL) March 29, 2026
Scorecard ▶️ https://t.co/JmJcgsoHQ7#KhelBindaas | #MIvKKR pic.twitter.com/zOnWb5Sc8U