LOADING...
MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు!
ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు!

MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore), పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) ప్లేఆఫ్స్‌ కోసం సురక్షిత స్థానాలను దక్కించుకున్నాయి. ఇప్పుడు మిగిలిన ఒక్కో స్థానం కోసం ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేడు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ ఫలితం ప్లేఆఫ్స్‌లో ప్రాముఖ్యత కలిగి ఉంది.

Details

ఢిల్లీకి పరిస్థితి సంక్లిష్టం

ముంబయి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నా, ఢిల్లీ 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇరువురు జట్లు ఇంకా రెండే రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌ ఫలితం ప్లేఆఫ్స్‌ పోటీలో కీలక మలుపు తీసుకురావచ్చు. ముంబయి గెలిస్తే 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఎందుకంటే, ఆ తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే కూడా 15 పాయింట్లే సాధించగలదు. దీంతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌ చేరాలంటే ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

Details

 ముంబయి ఓడితే.. ఢిల్లీకి అవకాశాలు

మరోవైపు, ముంబయి ఈ రోజు ఓడితే, ఢిల్లీలకు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు అవకాశాలు పెరుగుతాయి. అయితే, ఆ తర్వాత మ్యాచ్‌లో ఢిల్లీ తప్పక గెలవాల్సి ఉంటుంది. అప్పుడు ఢిల్లీ 17 పాయింట్లతో ముంబయిని దాటుతుంది.

Advertisement

Details

టాప్‌ 2 స్థానాల కోసం కీలక ఫైట్ 

గుజరాత్‌, బెంగళూరు, పంజాబ్‌ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు వెళ్లగా, టాప్‌ 2 స్థానాలను దక్కించుకోవడానికి కఠిన పోటీ సాగుతుంది. ఈ జట్లు ఇంకా రెండే రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో, తాము టాప్‌ 2లో నిలవడానికి మరింత శ్రమ పడతాయి. టాప్‌ 2లో నిలిచిన జట్లకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయి. క్వాలిఫయర్‌ 1లో ఓడినా, ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్టుతో క్వాలిఫయర్‌ 2లో పోటీపడే అవకాశం కలుగుతుంది. అందువల్ల, ప్రతి మ్యాచ్‌, ప్రతి పాయింట్‌, రన్‌రేట్‌ ఈ జట్లకు అత్యంత కీలకం.

Advertisement