LOADING...
PV Sindhu: దుబాయ్‌ ఉద్రిక్తతల తర్వాత స్వదేశానికి చేరుకున్న పీవీ సింధు
దుబాయ్‌ ఉద్రిక్తతల తర్వాత స్వదేశానికి చేరుకున్న పీవీ సింధు

PV Sindhu: దుబాయ్‌ ఉద్రిక్తతల తర్వాత స్వదేశానికి చేరుకున్న పీవీ సింధు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్‌ షట్లర్‌ పివి.సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం ఆమె బెంగళూరు విమానాశ్రయానికి చేరినట్లు స్వయంగా సోషల్‌ మీడియా వేదిక 'ఎక్స్‌'లో వెల్లడించారు. 'సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నాను. కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొన్నాను. చివరికి ఇంటికి చేరుకోవడం సంతోషంగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని సురక్షితంగా చూసుకున్న దుబాయ్‌ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఇమిగ్రేషన్‌ అధికారుల సహాయానికి కృతజ్ఞతలు. వారి సేవలను మాటల్లో చెప్పలేను. కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత నా భవిష్యత్తు ప్రణాళికలపై ఆలోచిస్తానని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

Details

దుబాయ్ విమానాశ్రయంలో నిలిచిపోయిన పివి.సింధు

గతవారం ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌కు బయల్దేరిన సింధు, అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఘర్షణల ప్రభావంతో దుబాయ్‌ విమానాశ్రయంలోనే నిలిచిపోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో గత శనివారం నుంచి విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె ప్రయాణం నిలిచిపోయింది. దీంతో సురక్షిత ప్రాంతంలోనే దుబాయ్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూఏఈ, భారత అధికారుల సమన్వయంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు చేపట్టారు.

Details

అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది

ఆ ఏర్పాట్లలో భాగంగానే సింధు కూడా బెంగళూరుకు చేరుకున్నారు. ఇదిలాఉండగా, ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మంగళవారం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సింధు పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ప్రయాణ ఆటంకాల కారణంగా క్రీడాకారులు ఆలస్యంగా చేరితే షెడ్యూల్‌లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Advertisement