LOADING...
IPL 2025: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలో రికార్డు సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలో రికార్డు సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

IPL 2025: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలో రికార్డు సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో వరుసగా రెండు మ్యాచ్‌లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తన సత్తా చాటింది. చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings) పై వారి సొంత మైదానంలో ఘన విజయం సాధించి క్రికెట్ ప్రేమికుల మనసులను దోచుకుంది. ఈ విజయంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ హవా కొనసాగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన జాబితాలో, సీఎస్కేను అధిగమించి ఆర్సీబీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 17.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ఆర్సీబీ తాజాగా 17.8 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ, సీఎస్కేతో పోల్చితే మెరుగైన ప్రదర్శనను అందిస్తోంది.

వివరాలు 

50 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ

చెపాక్ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన కనబరిచింది. చెన్నై సొంత మైదానంలో 17 ఏళ్ల విరామం అనంతరం ఆర్సీబీ విజయాన్ని సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో, ఆర్సీబీ 50 పరుగుల తేడాతో గెలిచి మరో ఘనతను సాధించింది.