Page Loader
టీమిండియా భారీ షాక్.. కెప్టెన్ దూరం
టీమిండియా భారీ షాక్.. కెప్టెన్ దూరం

టీమిండియా భారీ షాక్.. కెప్టెన్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2023
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టుకు గట్టి షాక్ తగలనుంది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. దీంతో ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి. చైనాలోని హాంగ్ ఝౌ వేదికగా జరగనున్న ఏసియన్ గేమ్స్ లో తొలి రెండు టీ20 మ్యాచులకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లేకుండానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో అంపైర్స్ నిర్ణయంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ క్రికెటర్ 2 డీమెరిట్ పాయింట్లకు ఓ టీ20 మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆమెకు 4 డీమెరిట్ పాయింట్లు రావడంతో రెండు మ్యాచులకు దూరం కావాల్సి ఉంటుంది.

Details

హర్మన్ ప్రీత్ కౌర్ స్థానంలో స్మృతి మంధాన?

ఐసీసీ నిబంధనల ప్రకారం ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు హర్మన్ ప్రీత్ కౌర్ లేకుండా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. అయితే భారత్ ఫైనల్ కు చేరుకుంటే హర్మన్ ఆ మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ హర్మన్ దూరమైతే మహిళల క్రికెట్ జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసియాలో టాప్‌ జట్టుగా ఉన్న టీమిండియా ఏసియన్‌ గేమ్స్‌లో నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.