Page Loader
Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్.. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగిన రిషబ్ పంత్
బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగిన రిషబ్ పంత్

Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్.. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగిన రిషబ్ పంత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2023
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టాడు. కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ తొలిసారి బ్యాట్ పట్టాడు. పంత్ ఓ లోకల్ మ్యాచులో బ్యాటింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి పంత్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. పంత్ సాధారణ స్థితికి చేరుకొని మళ్లీ భారత్ తరుపున ఆడాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పంత్ JSW ఫౌండరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హజరయ్యారు.

Details

మైదానంలో చురుగ్గా కదిలిన రిషబ్ పంత్

మొదట ఆ కార్యక్రమంలో ప్రసంగించిన పంత్, కాసేపటి తర్వాత బ్యాట్ ను అందుకున్నాడు. మైదానంలో వేగంగా కదలటమే కాకుండా, మునుపటిలాగా అలవోకగా సిక్సులు బాదేశాడు. ఫ్రంట్ ఫుట్‌లో ఎక్ట్రా కవర్ మీదుగా పంత్ కొట్టిన సిక్స్ చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ వీడియో చూశాక పంత్ రీఎంట్రీకి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పంత్‌ వచ్చే ఏడాది ప్రారంభంలోనే తిరిగి తన ఆటను మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిక్సర్ బాదిన రిషబ్ పంత్