Loading...
Rishabh Pant: ధోనిని వెనక్కి నెట్టిన రిషభ్‌ పంత్‌.. విదేశాల్లో అరుదైన రికార్డు!
ధోనిని వెనక్కి నెట్టిన రిషభ్‌ పంత్‌.. విదేశాల్లో అరుదైన రికార్డు!

Rishabh Pant: ధోనిని వెనక్కి నెట్టిన రిషభ్‌ పంత్‌.. విదేశాల్లో అరుదైన రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ అరుదైన ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని అధిగమించాడు. విదేశీ గడ్డపై టెస్టుల్లో ధోని 2,496 పరుగులు చేయగా.. పంత్‌ 2,500 పరుగుల మైలురాయిని దాటాడు. దీంతో ఈ రికార్డు పంత్‌ ఖాతాలో చేరింది. కొలంబో వేదికగా శ్రీలంకతో భారత్‌ రెండో టెస్టు ఆడుతోంది. రెండో రోజు ఆటలో పంత్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం భారత్‌ 103 ఓవర్లలో 376/6 పరుగులు చేసింది. పంత్‌ 39 పరుగులతో, ధ్రువ్‌ జురెల్‌ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.

వివరాలు

గాయమైనా బరిలోకి.. అదృష్టం కలిసొచ్చింది

తొలి రోజు గాయం కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన పంత్‌.. 18 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్నాడు. రెండో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు.

అయితే 94వ ఓవర్‌లో అసిత ఫెర్నాండో వేసిన బంతి పంత్‌ భుజం కింది భాగంలో బలంగా తాకింది. ఆ బంతి స్టంప్స్‌కు కాస్త పక్కగా వెళ్లింది.

ఒకవేళ వికెట్లను తాకి ఉంటే పంత్‌ పెవిలియన్‌ చేరేవాడు.

ఈసారి అదృష్టం మాత్రం అతడి వైపే నిలిచింది. శ్రీలంక పేసర్లు షార్ట్‌ పిచ్‌ బంతులతో పంత్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ.. అతడు తనదైన శైలిలో ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో ఓ బంతిని ఏకంగా 95 మీటర్ల భారీ సిక్స్‌గా మలిచాడు.

వివరాలు

రెండో రోజు ఆరంభంలో వికెట్

రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్‌ వికెట్‌ కోల్పోయింది. అసిత ఫెర్నాండో వేసిన షార్ట్‌ పిచ్‌ బంతిని ఆడే ప్రయత్నంలో సారాంశ్‌ జైన్‌ (6) ఔటయ్యాడు.

అతడు ఇచ్చిన క్యాచ్‌ను కమిల్‌ మిషారా అద్భుతంగా అందుకున్నాడు. ఆ తర్వాత పంత్‌ క్రీజులోకి రావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

గాయంతో ఇబ్బంది పడినప్పటికీ అతడు బ్యాటింగ్‌కు కొనసాగుతూ.. మరోసారి తన పోరాట పటిమను చాటుతున్నాడు.

ADVERTISEMENT