Loading...
IND vs ENG: లార్డ్స్‌లో టీమిండియాకు షాక్‌.. రోహిత్‌ సెంచరీ వృథా.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌!
లార్డ్స్‌లో టీమిండియాకు షాక్‌.. రోహిత్‌ సెంచరీ వృథా.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌!

IND vs ENG: లార్డ్స్‌లో టీమిండియాకు షాక్‌.. రోహిత్‌ సెంచరీ వృథా.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ పర్యటన నిరాశాజనకంగా ముగిసింది. ఇప్పటికే టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఆదివారం (జూలై 19) లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో ఇంగ్లిష్ జట్టు కైవసం చేసుకుంది. వరుసగా రెండో సిరీస్‌లో ఓటమి చవిచూడడంతో టీమిండియాపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి.

వివరాలు

డకెట్-బెతెల్ ధాటికి భారీ స్కోరు

టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 387 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

ఓపెనర్ బెన్ డకెట్ 135 బంతుల్లో 141 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్ జాకబ్ బెతెల్ 93 బంతుల్లో 91 పరుగులతో అతడికి చక్కటి సహకారం అందించాడు.

చివర్లో అనుభవజ్ఞుడు జో రూట్ 48 బంతుల్లో 74 పరుగులతో అజేయంగా నిలవగా, కెప్టెన్ జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 387 పరుగులకు చేరుకుంది

వివరాలు

రోహిత్ వీరోచిత పోరాటం ఫలించలేదు

388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ గెలుపు కోసం చివరి వరకు పోరాడినా విజయానికి చేరుకోలేకపోయింది.

50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఇటీవల తన రిటైర్‌మెంట్‌పై వస్తున్న ఊహాగానాల మధ్య బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

110 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 138 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 77 పరుగులు చేసి రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

గిల్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి రోహిత్‌కు అండగా నిలిచాడు.

ADVERTISEMENT

వివరాలు

సామ్ కరన్ బౌలింగ్‌తో మ్యాచ్ మలుపు

భారత్ విజయానికి చివరి 42 బంతుల్లో 88 పరుగులు అవసరమైన సమయంలో మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగింది. ఈ దశలో సామ్ కరన్ అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు.

ముందుగా ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్ (14), శ్రేయస్ అయ్యర్ (0)లను పెవిలియన్‌కు పంపిన కరన్.. ఆ తర్వాత కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్ కూడా దక్కించుకుని భారత్ ఆశలకు గట్టి దెబ్బకొట్టాడు.

ఇక చివర్లో కేఎల్ రాహుల్ (12), అక్షర్ పటేల్ (2) కూడా త్వరగా ఔటవడంతో భారత్ లక్ష్యానికి 27 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.

ADVERTISEMENT

వివరాలు

సిరీస్ ఇంగ్లండ్ సొంతం

బ్యాటింగ్‌లో డకెట్, బెతెల్, రూట్, బట్లర్ రాణించగా.. బౌలింగ్‌లో సామ్ కరన్ నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అన్ని విభాగాల్లో సమష్టిగా మెరుగైన ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ మూడో వన్డేను గెలుచుకుని, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

మరోవైపు వరుసగా టీ20, వన్డే సిరీస్‌లను కోల్పోవడంతో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను నిరాశతో ముగించింది.

ADVERTISEMENT