Page Loader
Vinod Kambli: ఎంసీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు : వినోద్ కాంబ్లి
ఎంసీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు : వినోద్ కాంబ్లి

Vinod Kambli: ఎంసీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు : వినోద్ కాంబ్లి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌లో ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కు ఘనమైన చరిత్ర ఉంది. వాంఖేడ్ స్టేడియం తన 50వ పండగను జరుపుకుంటూ, జనవరి 19న స్వర్ణోత్సవం నిర్వహించుకోనుంది. ఈ ఉత్సవాలు వారం రోజుల ముందే ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందిన మాజీ క్రికెటర్లు వినోద్ కాంబ్లి, వసీమ్ జాఫర్, యువ క్రికెటర్ పృథ్వీ షా ఇతరులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. వారిని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ సన్మానించి, ప్రత్యేక మెమొంటోలను అందించారు. కాంబ్లి ఈ సందర్భంలో మాట్లాడుతూ తాను ఓపెనింగ్ బ్యాటర్‌గా ఈ కార్యక్రమాన్ని మిస్‌ కాకూడదని అనుకున్నానని, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు.

Details

భారత క్రికెట్‌కు ఈ సంఘం చేసిన సేవలు అమోఘం

స్కూల్ క్రికెట్ నుంచి తనకు ఎంసీఏ ఎంతో అవకాశాలు ఇచ్చిందన్నారు. భారత జట్టుకు ఆడేటప్పుడు కూడా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంగ్లండ్‌పై తన తొలి డబుల్ సెంచరీ వాంఖడేలోనే సాధించానని, ఇప్పుడు ఎంసీఏకు శుభాకాంక్షలని పేర్కొన్నారు. భారత క్రికెట్‌కు ఈ సంఘం చేసిన సేవలు అమోఘమని గవాస్కర్ కొనియాడారు. ఇంత పెద్ద వేదికపై తనను సన్మానించడం గొప్ప గౌరవమన్నారు. 2011లో వన్డే ప్రపంచకప్‌ను వాంఖడేలోనే భారత్ గెలిచిందని, ఇప్పుడు 50 ఏళ్ల సంబరాలను ఎంసీఏ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్, రోహిత్ శర్మ తదితర క్రికెటర్లకు కూడా ఎంసీఏతో అనుబంధం ఉంది.