LOADING...
IND vs UAE: యూఏఈను చిత్తు చేసిన టీమిండియా
యూఏఈను చిత్తు చేసిన టీమిండియా

IND vs UAE: యూఏఈను చిత్తు చేసిన టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
09:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ 2025లో భాగంగా మొదటి మ్యాచులో టీమిండియా శుభారంభం అందించింది. దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచులో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు భారత బౌలర్ల ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య చేధనలో భారత్ కేవలం 4.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (30), గిల్(20*), సూర్యకుమార్ యాదవ్ (7*) పరుగులు చేశారు. ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్‌ యాదవ్ 4, శివమ్ దూబే 3 వికెట్స్ పడగొట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

9 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు