Page Loader
సంచలన చరిత్ర సృష్టించిన టీమిండియా
అన్ని ఫార్మాట్లో నెంబర్ వన్‌గా నిలిచిన టీమిండియా

సంచలన చరిత్ర సృష్టించిన టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2023
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ క్రికెట్లో టీమిండియా సంచలన చరిత్ర సృష్టించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన క్రికెట్ ర్యాంకుల్లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లో భారత్ క్రికెట్ జట్టు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. మూడు ఫార్మాట్లో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇది రెండోసారి. నాగపూర్ టెస్టు సిరీస్ లో టీమిండియా విజయం సాధించడం ద్వారా 115 పాయింట్లతో టెస్టుల్లోనూ అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు భారత్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్‌ 106 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఈ ఘనత అందుకోవడంతో హిట్‌మ్యాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది

ఢిల్లీ

ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్టు

ఇంతకముందు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలవడం ద్వారా టీమిండియా వన్డేల్లో నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. ఆ తర్వాత అదే న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా టి20 ర్యాంకింగ్స్‌లోనూ నెంబర్‌వన్‌గా అవతరించింది. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టించాడు.న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా టి20 ర్యాంకింగ్స్‌లోనూ నెంబర్‌వన్‌గా అవతరించింది. అయితే ఈ సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికి.. అధికారికంగా మాత్రం మూడు ఫార్మాట్లకు రోహిత్‌ శర్మనే ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు ఇక భారత్, ఆసీస్‌ మధ్య ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.