NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Indonasia Open: అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్‌లోనే ఔట్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Indonasia Open: అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్‌లోనే ఔట్!
    అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్‌లోనే ఔట్!

    Indonasia Open: అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్‌లోనే ఔట్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 04, 2025
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు మెరుపులు మెరిపిస్తున్నారు.

    మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుతో పాటు, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జంట విజయవంతంగా తమ ప్రదర్శనను కొనసాగిస్తుండగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సతీశ్ కుమార్ కరుణాకరణ్ - ఆద్యా వరియత్ ద్వయం సత్తా చాటింది.

    మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. అయితే ఇదే విభాగంలో పోటీపడిన ఇతర భారత జట్లు తొలి రౌండ్ నుంచే ఇంటిబాట పట్టాయి.

    Details

    చైనీస్ తైపీ జంటపై విజయం 

    మిక్స్‌డ్ డబుల్స్ మొదటి రౌండ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరణ్ - ఆద్యా వరియత్ జోడీకి కఠినమైన పోటీ ఎదురైనప్పటికీ, వారు అద్భుతంగా పోరాడారు.

    యె హాంగ్ వీ - నికొలె గోంజలెస్ చాన్ (చైనీస్ తైపీ) జంటను మూడు గేముల్లో ఓడించారు.

    తొలి గేమ్‌ను 15-21తో కోల్పోయినా, ఒత్తిడిని తట్టుకుని మిగిలిన రెండు గేమ్‌లను 21-16, 21-17తో గెలిచి మొత్తం మ్యాచ్‌ను 45 నిమిషాల్లో తమవశం చేసుకున్నారు. ఈ విజయంతో వారు రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.

    Details

    విఫలమైన ఫేవరెట్ జంటలు

    కాగా మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగిన రోహన్ కపూర్ - రుత్దికా శివానీ గడ్డే జంట మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.

    జపాన్‌కు చెందిన యూచీ శిమొగమీ - సయక హొబర ద్వయం చేతిలో 14-21, 9-21తో సూటిగా పరాజయం పాలైంది. అదే విధంగా, అశిత్ సూర్య - అమృత ప్రముతేశ్ జంట కూడా తొలి రౌండ్‌లోనే గెలుపు ఆశలు గల్లంతయ్యాయి.

    అంతేకాదు, ఫేవరెట్ జంటగా భావించబడిన ధ్రువ్ కపిల్ - తనీషా క్రాస్టో జోడీ కూడా నిరాశ కలిగించింది.

    మలేషియాకు చెందిన రెండో సీడ్ టాంగ్ జీ చెన్ - ఈ వీ తోహ్ చేతిలో తక్కువ పోటీతోనే పరాజయం చవిచూసింది.

    Details

    భారత్ జోడికి నిరాశ

    వారిద్దరూ పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను ముగించడంతో, భారత్‌ జోడీకి తప్పేమి మిగలలేదు. ఈ

    ఫలితాలతో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్ తరఫున కేవలం కరుణాకరణ్ - ఆద్యా ద్వయం మాత్రమే పోటీలో నిలవగా, మిగతా జట్లు తొలే వెళ్తుండటం నిరాశ కలిగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్యాడ్మింటన్

    తాజా

    Indonasia Open: అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్‌లోనే ఔట్! బ్యాడ్మింటన్
    CM Chandrababu: కేబినెట్‌ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్
    Bangladesh: స్వాతంత్ర్య సమరయోధుల చట్టం సవరణ.. జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్‌ పేరు తొలగింపు  బంగ్లాదేశ్
    Rahul Gandhi: భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు! రాహుల్ గాంధీ

    బ్యాడ్మింటన్

    ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్ శుభారంభం ప్రపంచం
    ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకి చేదు అనుభవం ప్రపంచం
    భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ విజయాలపై ఓ కన్నేయండి ప్రపంచం
    ఇండియన్ వెల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఎలెనా రైబాకినా ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025