Rishabh Pant Failure IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాడు.. ఇప్పుడు ఫ్రాంచైజీకి భారంగా మారిన పరిస్థితి!
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్ను ఓపెనర్గా ప్రారంభించాడు. అక్కడ విఫలం కావడంతో తిరిగి మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తున్నాడు. గత సీజన్లో నాలుగో స్థానంలో ఆడిన ఆయన, ఈసారి పదే పదే బ్యాటింగ్ వరుసను మారుస్తున్నా ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదు. ఎకానా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన కీలక పోరులో ఓపెనర్ మిచెల్ మార్ష్ త్వరగానే అవుట్ కావడంతో పంత్ క్రీజులోకి వచ్చాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్తో మెరుపులు మెరిపించినప్పటికీ, ఆ జోరును కొనసాగించలేకపోయాడు.
వివరాలు
సిరాజ్ ఉచ్చులో పంత్..
మొహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడే క్రమంలో పంత్ క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. కేవలం 11 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో పంత్ 20 కంటే తక్కువ స్కోరుకే అవుట్ కావడం ఇది మూడోసారి. ఢిల్లీపై 7 పరుగులు, కోల్కతాపై 10 పరుగులు మాత్రమే చేసిన ఆయన, కేవలం హైదరాబాద్పై చేసిన 68 పరుగుల ఇన్నింగ్స్ మినహా మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు.
వివరాలు
వైభవ్ సూర్యవంశీ జోరు.. పంత్ బేజారు..
రిషబ్ పంత్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్లలో కలిపి మొత్తం 103 పరుగులు చేశాడు. అయితే 15 ఏళ్ల చిన్నారి వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో తన బ్యాటింగ్ సత్తాతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైభవ్ ఇప్పటివరకు ఈ టోర్నీలో ఏకంగా 18 సిక్సర్లు బాదాడు. అంటే, కేవలం సిక్సర్ల ద్వారానే ఆయన 108 పరుగులు సాధించాడు. ఒక సీనియర్ ఆటగాడు, కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన కెప్టెన్ మొత్తం చేసిన పరుగుల కంటే, ఒక కుర్రాడు కేవలం సిక్సర్లతోనే ఎక్కువ పరుగులు చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
వివరాలు
లక్నో జట్టులో ఆందోళన..
భారీ ఆశలతో పంత్ను కెప్టెన్గా నియమించుకున్న లక్నో యాజమాన్యం, ఆయన వైఫల్యంతో ఆందోళన చెందుతోంది. బ్యాటింగ్ లైనప్లో స్థిరత్వం లేకపోవడం, కెప్టెన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోవడం జట్టు విజయ అవకాశాలను దెబ్బతీస్తోంది. రాబోయే మ్యాచ్ల్లోనైనా పంత్ తన సహజ సిద్ధమైన ఆటతీరుతో ఫామ్లోకి వస్తారో లేదో వేచి చూడాలి.