LOADING...
APL 2025: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా గ్లోబల్‌ ఐకాన్‌ రామ్‌ చరణ్‌..
ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా గ్లోబల్‌ ఐకాన్‌ రామ్‌ చరణ్‌..

APL 2025: ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా గ్లోబల్‌ ఐకాన్‌ రామ్‌ చరణ్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో తొలిసారిగా జరగబోయే ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)కు ప్రఖ్యాత గ్లోబ్‌ ఐకాన్ రామ్‌ చరణ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించబడినట్టు జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ (ఏఏఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ లీగ్‌ అక్టోబర్‌ 2 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీ యుమున్ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో వేదికగా జరగనుంది. ఫ్రాంచైజీ ఆధారితంగా నిర్వహించబోయే ఈ టోర్నీలో, భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్‌, రికర్వ్‌ ఆర్చర్లుతో పాటు, ఇతర దేశాల ప్రతిష్టాత్మక ఆర్చర్లు కూడా ఒకే వేదికపై పాల్గొననున్నారు. ఈ లీగ్‌ దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు కల్పించడం, అలాగే భారత ఒలింపిక్‌ మూమెంట్‌ను ముందుకు నెట్టడం అనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిందని నిర్వాహకులు వెల్లడించారు.:

వివరాలు 

36 మంది భారత టాప్‌ ఆర్చర్లతో పాటు 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు

మొత్తం ఆరు ఫ్రాంచైజీలలో, 36 మంది భారత టాప్‌ ఆర్చర్లతో పాటు 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీపడతారు. ఈ లీగ్‌లో డైనమిక్‌ ఫార్మాట్ ప్రత్యేకతగా ఉంటుంది. లైట్ల వెలుతురులో, రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో ఆర్చర్లు గతంలో చూడని విధంగా పోటీపడతారు, ఇది ప్రేక్షకులకు కొత్త రీతిలో ఆర్చరీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ..ఆర్చరీ అనే క్రీడ..క్రమశిక్షణ, ఫోకస్‌, స్థితిస్థాపకతను కల్గి ఉంటుందన్న కారణంతో బంధం ఏర్పరుచుకోవడం జరిగింది. ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో కలిసి కొనసాగడం గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు గ్లోబల్‌ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను."

వివరాలు 

ఆర్చరీని మరో స్థాయిని తీసుకెళ్లేందుకు ఈ లీగ్‌ దోహదం చేస్తుంది

జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు అర్జున్‌ ముండా స్పందిస్తూ.. "దేశంలోని వివిధ గ్రామాల ప్రతిభావంతులైన ఆర్చర్లకు ఏపీఎల్‌ వేదికగా నిలుస్తుంది. ఈ లీగ్‌ ద్వారా వారు తమ ప్రతిభను నిరూపించుకొని భవిష్యత్‌ లక్ష్యాలను సాధించగలుగుతారు. అదనంగా, ఆర్చరీని మరో స్థాయిని తీసుకెళ్లేందుకు ఈ లీగ్‌ దోహదం చేస్తుంది. రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా యువతలో ఆర్చరీ పట్ల ఆకర్షణ పెంచుతారని ఆశిస్తున్నాం."