IND vs SL: శ్రీలంకతో టెస్టుకు ఊహించని మార్పులు.. సీనియర్ పేసర్కు షాక్, కుర్రాడికి ఛాన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంకతో శనివారం నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అంచనా ప్లేయింగ్ ఎలెవన్ను వెల్లడించాడు. అయితే ఆయన ఎంపిక చేసిన జట్టులో కొన్ని ఊహించని మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు చోటు కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాయి సుదర్శన్ గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ చాలాకాలం తర్వాత భారత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చాడు. దీంతో నంబర్-6 స్థానానికి ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ మధ్య పోటీ నెలకొంది.
వివరాలు
టాప్ ఆర్డర్లో పెద్దగా మార్పుల్లేవు
ఉపఖండ పరిస్థితుల్లో సర్ఫరాజ్కు మంచి అనుభవం ఉండటంతో పాటు స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నప్పటికీ.. అశ్విన్ మాత్రం అతడిని కాదని జురెల్కు తన తుది జట్టులో చోటిచ్చాడు.
అశ్విన్ అంచనా ప్రకారం యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు.
మూడో స్థానంలో సాయి సుదర్శన్ స్థానాన్ని దేవదత్ పడిక్కల్ భర్తీ చేస్తాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
రిషభ్ పంత్ ఐదో స్థానంలో వికెట్కీపర్ బ్యాటర్గా ఆడతాడని అశ్విన్ పేర్కొన్నాడు. ధ్రువ్ జురెల్ ఆరో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడని అంచనా వేశాడు.
అంటే పంత్, జురెల్ ఇద్దరికీ ఒకేసారి తుది జట్టులో చోటు కల్పించాడు.
వివరాలు
సర్ఫరాజ్కు మరోసారి నిరాశ
సర్ఫరాజ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ.. తొలి టెస్టులో అతడికి అవకాశం ఇవ్వకపోవచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ధ్రువ్ జురెల్ ఇటీవలి ఫామ్పై కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ.. అతడి వికెట్కీపింగ్ సామర్థ్యం, బ్యాటింగ్లో ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుని జట్టులోకి ఎంపిక చేయవచ్చని చెప్పాడు.
బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ను స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా అశ్విన్ ఎంచుకున్నాడు. కుల్దీప్ యాదవ్కు స్పెషలిస్ట్ స్పిన్నర్గా చోటిచ్చాడు.
గాలే పిచ్ మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుందని అశ్విన్ భావిస్తున్నాడు.
వివరాలు
ప్రసిద్ధ్ కృష్ణకు బదులు గుర్నూర్ బ్రార్!
అశ్విన్ తుది జట్టులో అతిపెద్ద సర్ప్రైజ్ గుర్నూర్ బ్రార్ ఎంపిక. సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టి గుర్నూర్కు అవకాశం ఇచ్చాడు.
శ్రీలంకతో తొలి టెస్టులో గుర్నూర్ టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉందని అశ్విన్ అంచనా వేశాడు. మహ్మద్ సిరాజ్తో కలిసి గుర్నూర్ కొత్త బంతిని పంచుకుంటాడని పేర్కొన్నాడు.
వార్మప్ మ్యాచ్లో తన వేగం, బౌన్స్తో శ్రీలంక బ్యాటర్లను గుర్నూర్ ఇబ్బంది పెట్టాడని.. తొలి టెస్టులోనూ అతడు మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
వివరాలు
అశ్విన్ అంచనా వేసిన తుది జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా
మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.