NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virat Kohli: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ కొత్త ప్రపంచ రికార్డు 
    తదుపరి వార్తా కథనం
    Virat Kohli: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ కొత్త ప్రపంచ రికార్డు 
    Virat Kohli: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ కొత్త ప్రపంచ రికార్డు

    Virat Kohli: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ కొత్త ప్రపంచ రికార్డు 

    వ్రాసిన వారు Stalin
    Mar 30, 2024
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున శుక్రవారం KKRపై జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ నిప్పులు చెరిగారు.

    బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు.

    కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఒకే వేదిక‌లో అత్యధిక టీ20 ర‌న్స్ చేసిన ఆట‌గాడిగా నిలిచాడు.

    మిర్పూర్‌లో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ 3239 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.

    ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి, క్యాష్ రిచ్ లీగ్‌లో RCB తరపున మాత్రమే ఆడాడు.

    Details 

    ఒకే వేదిక‌లో అత్యధిక టీ20 ర‌న్స్ చేసిన ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ

    బెంగళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో జరిగిన T20 మ్యాచ్‌లలో 3276 పరుగులు చేసిన కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ముష్ఫికర్ రహీమ్ ఉన్నాడు.

    అటు తరువాత మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్ ఆట‌గాడు అలెక్స్ హేల్స్‌, బంగ్లా ప్లేయ‌ర్ త‌మీమ్ ఇక్బాల్ ఉన్నారు.

    ట్రెంట్ బ్రిడ్జి వేదిక‌పై హేల్స్ 3,036 పరుగులు చేయగా.. మీర్పూర్ వేదిక‌గా త‌మీమ్ 3,020 ప‌రుగులు చేశాడు.

    మరోవైపు.. శుక్రవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 239 సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ దీర్ఘకాల రికార్డును కూడా బద్దలు కొట్టాడు కోహ్లీ.

    Details 

    కోల్ కతాపై అత్యధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా కోహ్లీ 

    ఆర్‌సీబీ త‌ర‌ఫున అత్యధిక సిక్సులు (241) కొట్టిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఇప్పుడు, గేల్ త‌ర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియ‌ర్స్ (ఆర్‌సీబీ -238), కీర‌న్ పొలార్డ్ (ఎంఐ-221), రోహిత్ శ‌ర్మ (ఎంఐ-210) ఉన్నారు.

    ఇదే కాకుండా.. నిన్నటి మ్యాచ్ లో 83 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ కోల్ కతాపై అత్యధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు.

    కోల్‌క‌తాపై 33 మ్యాచులు ఆడిన కోహ్లీ 944 రన్స్ సాధించి.. మూడో స్థానంలో 907 పరుగులతో శిఖ‌ర్ ధావ‌న్ ఉండగా... అత‌డిని దాటేశాడు.

    కాగా.. ఈ జాబితాలో మొద‌టి రెండు స్థానాల్లో డేవిడ్ వార్నర్ (1075), రోహిత్ శ‌ర్మ (1040) ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    తాజా

    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా

    విరాట్ కోహ్లీ

    Virat Kohli: నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి.. ఇదే నా నినాదం: విరాట్ కోహ్లీ టీమిండియా
    Virat Kohli: విరాట్ కోహ్లీ నా నిద్రతో చెలగాటమాడుతున్నారు : NBA జట్టు యజమాని టీమిండియా
    Virat Kohli: వాంఖడే స్టేడియంలో స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ (వీడియో) వాంఖేడ్ స్టేడియం
    IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్  వన్డే వరల్డ్ కప్ 2023

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా క్రికెట్
    WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: యూపీ వారియర్స్‌పై కనికా ఆహుజా సునామీ ఇన్నింగ్స్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025