NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / India Vs Pakistan: 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే? 
    తదుపరి వార్తా కథనం
    India Vs Pakistan: 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే? 
    'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే?

    India Vs Pakistan: 'ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 14, 2025
    11:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ క్రీడాభిమానులకు ఎప్పుడూ ఉత్కంఠను రేపిస్తుంది.

    ఈ రెండు జట్ల మధ్య ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు, ఆసక్తికర ఘటనలు క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.

    ఇప్పుడు ఈ క్రికెట్ రైవల్రీపై నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ తీసుకొస్తోంది. 'ది గ్రేట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్' పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ ప్రారంభం కానుంది.

    నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో తాజాగా విడుదల చేసిన డాక్యుమెంటరీ పోస్టర్‌లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ పాక్ జట్టుతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించడం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

    Details

    ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్

    ఈ డాక్యుమెంటరీలో సెహ్వాగ్, గంగూలీ, షోయబ్ అక్తర్, వాకర్ యూనిస్, ఇంజమామ్ ఉల్ హక్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్రముఖ ఆటగాళ్ల ప్రసంగాలు కూడా ఉంటాయని సమాచారం.

    ఈ డాక్యుమెంటరీలో, భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎలా అభివృద్ధి చెందిందో, దానికి కారణమైన ఆసక్తికర అంశాలను చూపించనున్నారు.

    నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీ గురించి 'రెండు దేశాల మధ్య అద్భుతమైన పోటీ, 160 కోట్ల మంది ఆశలు, భారత్-పాక్ క్రికెట్ అనుభవాన్ని మరింత ఆస్వాదించండి' అని పేర్కొంది.

    ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా జరగనున్న నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీపై మరింత ఆసక్తి నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    పాకిస్థాన్

    తాజా

    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్
    S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు  రష్యా
    Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని  కెనడా
    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం

    ఇండియా

    Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు ఆంధ్రప్రదేశ్
    UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి ఉత్తర్‌ప్రదేశ్
    Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్ కాంగ్రెస్
    Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్థికలు యమునా నదిలో నిమజ్జనం మన్మోహన్ సింగ్

    పాకిస్థాన్

    Gary Kirsten: పాక్‌కు గుడ్‌బై చెప్పిన గ్యారీ కిరిస్టెన్‌..కొత్త కోచ్ కోసం పీసీబీ పావులు! క్రికెట్
    Pakistan: లాహోర్ సిటీలో దారుణంగా రికార్డైన ఏక్యూఐ.. భారత్‌ను నిందించిన పాక్  అంతర్జాతీయం
    Pakistan: కరాచీలో కాల్పులు.. ఇద్దరు చైనా పౌరులకు గాయాలు  అంతర్జాతీయం
    Pakistan: పాకిస్తాన్‌లో రైలు బయలుదేరే సమయంలో భారీ పేలుడు.. 15 మందికి పైగా మృతి ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025