రవిచంద్రన్ అశ్విన్: వార్తలు

ఐసీసీ ర్యాకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్‌గా రవిచంద్రన్ అశ్విన్

అంతర్జాతీయ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను తాజాగా అంతర్జాతీయ కౌన్సిల్ విడుదల చేసింది. గతంలో టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు ఇంగ్లాండ్ స్పీడ్ స్టార్ అండర్సన్ ఇద్దరు 859 పాయింట్లతో సమానంగా నిలిచారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. ఈ సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను సృష్టించాడు. సిరీస్ మొత్తం 25 వికెట్లు పడగొట్టి, 86 పరుగులు చేశాడు.

ఇలా అయితే బౌలింగ్ జాబ్ వదిలేస్తానన్న అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా వరుసగా నాలుగోసారి గెలుచుకుంది.

అక్షయ్‌కుమార్ మూవీ సీన్‌పై టీమిండియా క్రికెటర్ల ఫన్నీ వీడియో

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' గా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం సాధించిన తర్వాత అక్షయ్ కుమార్ మూనీ సీన్‌పై ఓ వీడియో చేశారు. ఈ వీడియోను రవిచంద్రన్ అశ్విన్ తన ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో పోస్టు చేశాడు.

అండర్సన్ రికార్డును సమం చేసిన రవిచంద్రన్ అశ్విన్

భారత్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును బ్రేక్ చేశారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వికెట్ల వేట కొనసాగించిన అశ్విన్ అండర్సన్ రికార్డును సమం చేశారు. 32సార్లు ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ చరిత్ర సృష్టించారు.

అండర్సన్ దూసుకొచ్చినా అశ్వినే నెంబర్ వన్

టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ప్రభావం చూపలేకపోయిన అశ్విన్ ఆరు రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. దీంతో బుధవారం ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 859 పాయింట్లతో అశ్విన్, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ నెంబర్ వన్ స్థానంలో సమానంగా నిలిచారు.

సంచలన రికార్డును బద్దలుకొట్టనున్న రవిచంద్రన్ అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. మార్చి 9న ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే చివరి టెస్టులో మరో అరుదైన రికార్డుపై అశ్విన్ కన్నేశాడు.

IND vs AUS : తెలివిగా ఖావాజాను ఔట్ చేసిన అశ్విన్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకు అలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 76 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఖావాజా డకౌట్ అయ్యాడు.

ఐసీసీ నెంబర్.1 టెస్టు బౌలర్‌గా అశ్విన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. గతవారం ఐసీసీ నెంబర్ వన్ 1 టెస్టు బౌలర్ గా అవతరించిన జేమ్స్ అండర్సన్ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రాణించలేకపోయాడు. దీంతో రెండో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 864 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

IND vs AUS: మూడో టెస్టులో అశ్విన్‌ను ఊరిస్తున్న నెం.1 రికార్డు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ల నడ్డి విరిచిన అశ్విన్ ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో ఆడటానికి చూస్తే పళ్లు రాలిపోతాయి

గవాస్కర్ టోఫ్రీలో భాగంగా టీమిండియా 2-0 ఆధిక్యంలో కొసాగుతోంది. టీమిండియా విజయంలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించారు. రెండో టెస్టులో వీరిద్దరూ ఏకంగా 16 వికెట్లు తీసి సత్తా చాటారు.

బౌలర్ల జాబితాలో రికార్డు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్

అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచి టీమిండియా జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 132 పరుగులు తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించి, రికార్డులను సృష్టించిన అశ్విన్

నాగ్‌పూర్ మొదటి టెస్టులో అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు వణికిపోయారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో రోజు కూడా ఆట ముగియకముందే ఆస్ట్రేలియా 132 పరుగులు తేడాతో ఓడిపోయింది.

టెస్టులో చరిత్రను తిరగరాసిన రవిచంద్రన్ అశ్విన్

టీమిండియా వెటనర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టులో చరిత్రను సృష్టించాడు. టెస్టు క్రికెట్లో 450 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. నాగపూర్ వేదికగా జరుగుతున్న మొదటి మ్యాచ్ లో అలెక్స్ క్యారీని అశ్విన్ ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఈ మైలురాయిని అందుకున్న రెండో ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు.

పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్

ఆసియాకప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. పా‌కిస్తాన్ వేదికగా ఆసియా కప్‌ను నిర్వహిస్తే.. పాక్‌లో ఆడేదిలేదని టీమిండియా ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఆడాలని భావిస్తే మాత్రం వేదికను మార్చాలని సూచించింది. పాకిస్తాన్‌లో టీమిండియా ఆసియాకప్ ఆడకపోతే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాక్ ఆడదిలేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సౌథీ వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి.