Ashwin: ఇదేమీ జోక్ కాదు.. బెన్ డకెట్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించిన రవిచంద్రన్ అశ్విన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ తోజరిగిన రెండు సిరీస్లను ఇంగ్లండ్ కోల్పోయింది. మొదటగా, టీ20 సిరీస్ను 4-1 తేడాతో నష్టపోగా, మూడు వన్డేల సిరీస్లో ఒక్క మ్యాచ్ను కూడా గెలవలేకపోయింది.
ఈ సిరీస్ తర్వాత ఇంగ్లండ్ పేసర్ బెన్ డకెట్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు.
అతడు జోక్ చేసినప్పటికీ, అదిఅలా అనిపించడం లేదని చెప్పాడు. ఈ ఓటమి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుందని వివరించాడు.
వివరాలు
అశ్విన్ ఏమన్నాడంటే?
"బెన్ డకెట్ వ్యాఖ్యలను పక్కన పెడితే, ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత్ చేతిలో సిరీస్ ఓటమి ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని తప్పకుండా దెబ్బతీస్తుంది. గతంలో కూడా బెన్ డకెట్ ఇలాంటి హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాడు.అతని మాటల ప్రకారం,యశస్వి జైస్వాల్ తన దూకుడైన ఆటతీరును ఇంగ్లండ్ నుంచి నేర్చుకున్నాడట! అయితే, అతని హ్యూమర్ బాగానే ఉంటుంది. కానీ, ఓటమిని అంగీకరించకుండా హాస్యం ద్వారా దాచిపెట్టడం సరైన విధానం కాదు.
ఇంగ్లండ్ జట్టు గత వన్డే ప్రపంచ కప్ 2023లో కూడా నిరాశాజనక ప్రదర్శన చేసింది.ఇప్పుడు గత రెండు నెలలుగా జట్టులోని ఆటగాళ్లు ఫామ్లో లేరు.
అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వారు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నారు. ఇదే పరిస్థితి టెస్టు క్రికెట్లో కూడా ఉంది.
వివరాలు
బెన్ డకెట్ ఏమన్నాడంటే?
జట్టు సారథి బెన్ స్టోక్స్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
నేను అతనికి ఒకే ఒక్క సలహా ఇస్తున్నాను— ఓటమిని అర్థం చేసుకోవడం నేర్చుకో. ప్రతి ఓటమి తర్వాత నిందలు వేయడం సరికాదు" అని అశ్విన్ పేర్కొన్నాడు.
"మేం భారత్ చేతిలో 3-0 తేడాతో సిరీస్ను కోల్పోయాం. అయినా, మేం దానిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకోవడమే మా లక్ష్యం. ఈ సిరీస్ ఫలితంపై ఎవరూ ఆందోళన చెందడం లేదు. ఐసీసీ ట్రోఫీలో మా అసలు సామర్థ్యాన్ని చూపిస్తాం" అని ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్ వ్యాఖ్యానించాడు.