IND vs PAK: 'దీనంతటికీ వారి మైండ్సెట్టే కారణం'.. పాకిస్థాన్ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట పాకిస్థాన్ వివాదం వేళ టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు వచ్చే నాలుగైదు రోజుల్లో పాకిస్థాన్ దారికొస్తుందని అభిప్రాయపడ్డాడు. ఖచ్చితంగా భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. బంగ్లాదేశ్కు మద్దతుగా, పాకిస్థాన్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరించగా, విషయం తెలిసిందే. "నూటికి నూరుశాతం, భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది. మరో నాలుగైదు రోజుల్లో పాకిస్థాన్ మైదానానికి వస్తుంది. నేను ఈ పోరును ప్రత్యక్షంగా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నాడు. ఒకవేళ, పాక్ భారత్తో మ్యాచ్ ఆడకపోతే ఏర్పడే పరిణామాలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు టీ20 వరల్డ్కప్ 2026
"పాకిస్థాన్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రాడ్కాస్టర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతారు.మిగతా క్రికెట్ బోర్డులు ఇబ్బందుల్లో పడతాయి.ICC మీటింగ్లో ఈ సమస్య ప్రస్తావనకు వస్తుంది. అదనంగా,పీఎస్ఎల్ కోసం విదేశీ ఆటగాళ్లకు NOC ఇవ్వడంలో కూడా సమస్యలు ఏర్పడతాయి"అని అశ్విన్ విశ్లేషించారు. "భారత్,పాకిస్థాన్ ఇప్పటికే తటస్థ వేదికల్లో పోటీ పడుతున్నాయి. కాబట్టి వేదిక సమస్యే ప్రధాన కారణం కాదు. ఏ ప్రత్యర్థితోనైనా నేను ఆడను అనడం తగదు. పాకిస్థాన్కు భారత్ పెద్ద శత్రువు,వారి మైండ్సెట్ కూడా దీనికి కారణం"అని అశ్విన్ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్కప్ 2026 ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలపై జరుగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 దేశాల జట్లు పాల్గొననున్నాయి.