NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC - Ashwin: ఐసీసీ నిబంధనలతో స్పిన్నర్లకు ప్రమాదం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    ICC - Ashwin: ఐసీసీ నిబంధనలతో స్పిన్నర్లకు ప్రమాదం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు 
    ఐసీసీ నిబంధనలతో స్పిన్నర్లకు ప్రమాదం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు

    ICC - Ashwin: ఐసీసీ నిబంధనలతో స్పిన్నర్లకు ప్రమాదం.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 01, 2025
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వన్డేల్లో ఐసీసీ తీసుకొచ్చిన నిబంధనలతో స్పిన్నర్లకు ఇబ్బందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు.

    తక్షణమే ఈ నిబంధనలను తొలగించి, లేకపోతే వన్డే క్రికెట్‌ మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.

    ఇటీవల జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల గురించి కూడా అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    Details

    వన్డే క్రికెట్ భవిష్యత్తుపై అశ్విన్ ఆందోళన

    అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్‌కి ముందు తాను వన్డే ఫార్మాట్‌ గురించి ఆలోచించానని, వన్డేలకు భవిష్యత్తు ఉందా అనే సందేహం కలిగిందన్నారు.

    ఎందుకంటే, టీ20లు తక్కువ సమయంలో ఫలితాన్ని ఇస్తుండటంతో ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోందన్నారు.

    టెస్టు క్రికెట్‌కూ మంచి స్పందన వస్తోందని, అఫ్గానిస్థాన్‌ వంటి జట్లు తమ దేశవాళీ క్రికెట్‌లో మార్పులు తీసుకొస్తే, టెస్టులు మరింత ఆసక్తికరంగా మారతాయని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

    Details

    స్పిన్నర్లకు నష్టం, బ్యాటర్లకు ప్రయోజనం

    2013-14 వరకు వన్డేల్లో ఒక్కే బంతితో ఇన్నింగ్స్‌ సాగేదని, కానీ ఇప్పుడు రెండు కొత్త బంతులు తీసుకురావడంతో పాటు ఫీల్డింగ్‌ సర్కిల్‌లో ఐదుగురు మాత్రమే ఉండేలా ఐసీసీ నిబంధనలు మార్చింది.

    అప్పటి నుంచి స్పిన్నర్ల ప్రాధాన్యత తగ్గిపోయిందని, ఇది భారత స్పిన్‌ సంస్కృతిని దెబ్బతీసేందుకు తీసుకొచ్చిన మార్పులా అనిపిస్తోందన్నారు.

    ముఖ్యంగా రివర్స్‌ స్వింగ్‌ కనుమరుగైపోయిందని అశ్విన్ వ్యాఖ్యానించారు.

    Details

     2027 వన్డే ప్రపంచకప్‌ నిర్వహణ కఠిన పరీక్షే 

    2027 వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్నారు. అయితే, ఈ టోర్నీని నిర్వహించడం ఐసీసీకి పెద్ద సవాలే. వన్డే ఫార్మాట్‌కి ఇప్పుడు స్థానం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

    ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభంలో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ, అఫ్గానిస్థాన్ - ఇంగ్లండ్ మ్యాచ్‌లో అఫ్గాన్ అద్భుత ప్రదర్శన చేసి పోటీలను రసవత్తరంగా మార్చింది.

    వన్డేలకు భవిష్యత్తు ఉండాలంటే, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అశ్విన్ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవిచంద్రన్ అశ్విన్
    ఐసీసీ

    తాజా

    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా

    రవిచంద్రన్ అశ్విన్

    ప్రపంచ కప్ జట్టులోకి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. చెప్పకనే చెప్పేసిన కెప్టెన్ రోహిత్ టీమిండియా
    రవిచంద్రన్ అశ్విన్ ఓ లెజెండ్.. పొగడ్తలతో ముంచెత్తిన చాహల్! చాహల్
    Rohit Sharma: వరల్డ్ కప్‌లో అశ్విన్ ఆడతాడా..? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ!  రోహిత్ శర్మ
    Team India : టీమిండియా వరల్డ్ కప్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా

    ఐసీసీ

    Champions Trophy 2025: పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరణ.. ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం  పాకిస్థాన్
    ICC: ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న నోమన్ అలీ, అమేలియా కెర్ క్రికెట్
    IND vs PAK: పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ వీసా నిరాకరణ.. ఎందుకంటే? పాకిస్థాన్
    Champions Trophy tour: పీఓకేలో ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌ రద్దు.. కారణం ఏంటంటే? పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025