LOADING...
Yashasvi Jaiswal: 24 ఏళ్లకే ప్రపంచ రికార్డు సాధించిన యశస్వీ జైస్వాల్.. టీమిండియా తొలి ప్లేయర్‌గా!
24 ఏళ్లకే ప్రపంచ రికార్డు సాధించిన యశస్వీ జైస్వాల్.. టీమిండియా తొలి ప్లేయర్‌గా!

Yashasvi Jaiswal: 24 ఏళ్లకే ప్రపంచ రికార్డు సాధించిన యశస్వీ జైస్వాల్.. టీమిండియా తొలి ప్లేయర్‌గా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2025
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

యశస్వీ జైస్వాల్... ఈ పేరు ఇప్పుడు భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 23 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును పొందిన యశస్వి, వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 173 పరుగులు నమోదు చేసి మరో అద్భుతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీతో అతను ఒక ప్రపంచ రికార్డును సమం చేయడమే కాక, అత్యంత అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ ఓపెనర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ ఈ ఘనతతో దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్ (7 సెంచరీలు) రికార్డును సమం చేశాడు. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌పై మ్యాచ్‌లో, అతను తన కెరీర్‌లో ఏడవ టెస్ట్ సెంచరీని నమోదు చేయడం విశేషం.

 Details

ఓపెనర్ గా చరిత్ర

ఓపెనర్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతలో, సచిన్ టెండూల్కర్ తర్వాత (11 సెంచరీలు)అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన భారత క్రికెటర్‌గా (7 సెంచరీలు) రెండో స్థానంలో నిలిచాడు. డాన్ బ్రాడ్‌మన్ (12),గ్యారీ సోబర్స్ (9) వంటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలతో సమాంతరంగా అతను చేరాడు. యశస్వి సాధించిన 7 టెస్ట్ సెంచరీలలో, ఏకంగా 5 సెంచరీలు 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఉండడం, అతని భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యానికి నిదర్శనం. ఈ రికార్డులో సచిన్ టెండూల్కర్ (4) ను కూడా అతను అధిగమించాడు. 24ఏళ్ల లోపే టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక 150+ స్కోర్లు సాధించిన భారతీయ ఆటగాడిగా యశస్వి నిలిచాడు.