LOADING...
Pakistan Airstrikes in Afghanistan: పాక్‌ వైమానిక దాడులు.. కాబుల్‌ ఆస్పత్రిపై దాడి, 400 మంది మృతి
పాక్‌ వైమానిక దాడులు.. కాబుల్‌ ఆస్పత్రిపై దాడి, 400 మంది మృతి

Pakistan Airstrikes in Afghanistan: పాక్‌ వైమానిక దాడులు.. కాబుల్‌ ఆస్పత్రిపై దాడి, 400 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
07:53 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గానిస్థాన్‌పై పాక్‌ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో కాబుల్‌లోని ఓ ఆస్పత్రి తీవ్రంగా దెబ్బతినగా, వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అఫ్గాన్‌ అధికారులు తెలిపారు.

వివరాలు 

ఆస్పత్రిపై దాడి.. భారీ ప్రాణనష్టం

మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందించే కాబుల్‌లోని ఒక ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు అఫ్గాన్‌ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాట్‌ వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 400 మంది మృతి చెందగా, మరో 250 మందికి పైగా గాయపడినట్లు ఆయన తెలిపారు. దాడి అనంతరం ఆస్పత్రి భవనంలో భారీగా మంటలు చెలరేగాయని, వాటిని అదుపులోకి తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయని చెప్పారు. ఆస్పత్రి పూర్తిగా ధ్వంసమైందని, శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు.

వివరాలు 

ఆరోపణలను ఖండించిన పాకిస్థాన్

ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామన్న అఫ్గాన్‌ ఆరోపణలను పాకిస్థాన్‌ తీవ్రంగా ఖండించింది. తమ దాడులు అఫ్గాన్‌ సైనిక స్థావరాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపైనే జరిగాయని పాక్‌ సమాచార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్‌లో పౌరులకు లేదా ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొంది.

Advertisement