Iran: ట్రంప్,నెతన్యాహు హత్యకు రూ.560 కోట్ల బహుమతి..? ఇరాన్లో కొత్త బిల్లుపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అక్కడి పార్లమెంట్లో కీలక చర్చలు సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును హతమార్చిన వారికి భారీ నగదు బహుమతి ప్రకటించేలా కొత్త చట్టం తీసుకురావాలని ఇరాన్ ఎంపీలు పరిశీలిస్తున్నారు. బ్రిటన్కు చెందిన 'టెలిగ్రాఫ్' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ జాతీయ భద్రతా కమిషన్ అధ్యక్షుడు ఇబ్రహీం అజీజీ ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఇస్లామిక్ రిపబ్లిక్ సైనిక, భద్రతా దళాల పరస్పర సమన్వయం' పేరుతో ప్రత్యేక బిల్లును సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
ట్రంప్ను హతమార్చిన వ్యక్తికి ఐదు కోట్ల యూరోలు
ఈ బిల్లులో భాగంగా ట్రంప్ను హతమార్చిన వ్యక్తికి ఐదు కోట్ల యూరోలు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.560.85 కోట్ల బహుమతి అందించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. నెతన్యాహుపై కూడా ఇలాంటి చర్యలకే చట్టపరమైన ప్రోత్సాహం కల్పించే అంశాలపై సభ్యులు చర్చిస్తున్నారని పేర్కొన్నారు.