Thailand: థాయిలాండ్లో అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బస్సు.. 14 మంది మృతి, 20 మందికి గాయాలు
థాయిలాండ్లో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కనీసం 14 మంది మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. థాయిలాండ్ పశ్చిమ ప్రావిన్స్లోని ప్రచువాప్ ఖిరీ ఖాన్లో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి రెస్క్యూ సిబ్బంది ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదం తర్వాత బస్సు ముందు భాగం సగానికి చీలిపోయిందని రాష్ట్ర ప్రసార సంస్థ థాయ్పిబిఎస్ని ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. గాయపడిన వారందరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు .