టిబెట్లోని జిజాంగ్లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
టిబెట్లోని జిజాంగ్ ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపనలు వచ్చాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) ఒక ట్వీట్లో తెలిపింది.
భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:23 గంటలకు జిజాంగ్ ప్రాంతంలో 106 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది.
తెల్లవారు జామున భూకంపం రావడంతో నిద్రపోతున్న జనం ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, ఇళ్లలోని పరుగులు తీశారు.
అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చేసిన ట్వీట్
Earthquake of Magnitude:4.3, Occurred on 13-06-2023, 03:23:05 IST, Lat: 32.92 & Long: 86.93, Depth: 106 Km ,Location: Xizang for more information Download the BhooKamp App https://t.co/z7JAWXGxpt@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES @KirenRijiju pic.twitter.com/4RsK0ey28t
— National Center for Seismology (@NCS_Earthquake) June 12, 2023