Loading...
Apple: నేపాల్‌,టిబెట్‌లో వరద బీభత్సం.. బాధితులకు విరాళం ప్రకటించిన ఆపిల్
నేపాల్‌,టిబెట్‌లో వరద బీభత్సం.. బాధితులకు విరాళం ప్రకటించిన ఆపిల్

Apple: నేపాల్‌,టిబెట్‌లో వరద బీభత్సం.. బాధితులకు విరాళం ప్రకటించిన ఆపిల్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ కీలక ప్రకటన చేశారు. నేపాల్‌,టిబెట్‌లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో సహాయక చర్యలు,పునర్నిర్మాణ కార్యక్రమాలకు ఆపిల్‌ విరాళం అందించనుంది. హిమాలయాల్లో హిమానీనదం కూలిపోవడంతో ఓ నది మార్గం అడ్డుకుపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా వరద నీరు దిగువ ప్రాంతాలకు విడుదల కావడంతో ఈ విపత్తు సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది నిరాశ్రయులయ్యారు. మౌలిక వసతులకు కూడా భారీగా నష్టం వాటిల్లింది.

వివరాలు 

గతంలోనూ ఆపిల్‌ విరాళాలు

ఇండోనేషియాలో భూకంప బాధితుల సహాయక చర్యలకు ఇటీవలే విరాళం ఇస్తామని ఆపిల్‌ ప్రకటించింది.

తాజాగా నేపాల్‌, టిబెట్‌ వరద బాధితులకు సాయం చేయనున్నట్లు టిమ్‌ కుక్‌ వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆపిల్‌ సాయం చేయడం ఇదే తొలిసారి కాదు.

వెనిజులా, దక్షిణ యూరప్‌, జపాన్‌లో సంభవించిన ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లోనూ ఆపిల్‌ గతంలో విరాళాలు అందించింది.

వివరాలు 

ఉద్యోగుల కోసం 'ఎంప్లాయీ గివింగ్‌' కార్యక్రమం

ప్రకృతి విపత్తులు,ఇతర అత్యవసర పరిస్థితుల్లో సాయం చేయడంతో పాటు ఆపిల్‌ సంస్థలో 'ఎంప్లాయీ గివింగ్‌' అనే ప్రత్యేక కార్యక్రమం కూడా కొనసాగుతోంది.

ఈ కార్యక్రమం ద్వారా అర్హత ఉన్న ఉద్యోగులు విరాళంగా ఇచ్చే మొత్తానికి సమాన మొత్తాన్ని ఆపిల్‌ కూడా అందిస్తుంది.

అలాగే ఉద్యోగులు స్వచ్ఛంద సేవల్లో పాల్గొనే ప్రతి గంటకు 25 డాలర్ల చొప్పున సంస్థ విరాళం ఇస్తుంది.

ఈ రెండు రకాల విరాళాలను కలిపి ఒక్కో ఉద్యోగికి ఏడాదిలో గరిష్ఠంగా 10,000 డాలర్ల వరకు ఆపిల్‌ అందిస్తుంది.

ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల డాలర్లకు పైగా నిధులు సమకూరాయి.

దాదాపు 44 వేల స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సమాజాలకు ఈ నిధుల ద్వారా సహాయం అందింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టిమ్‌ కుక్‌ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT