Page Loader
పాకిస్థాన్: పెషావర్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు
పాకిస్థాన్: పెషావర్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు

పాకిస్థాన్: పెషావర్‌లో పేలుడు.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు

వ్రాసిన వారు Stalin
Sep 11, 2023
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా సోమవారం జరిగిన పేలుడులో పారామిలటరీ సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులతో సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో వాహనం మచ్ని నుంచి పెషావర్ వైపు వెళుతోంది. ఈ దాడిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ఉపయోగించినట్లు ఎస్పీ మహ్మద్ అర్షద్ ఖాన్ తెలిపారు. పేలుడు ప్రభావంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మాలి ఖేల్ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది మరణించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దాడికి బాధ్యత వహించిన 'టీటీపీ'