Trump: భారత్, చైనాపై రేడియో వ్యాఖ్యాత వివాదాస్పద వ్యాఖ్యలు.. రీపోస్టు చేసిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలకాలన్న ఒక కామెంట్ను తాజాగా తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్ సోషల్'లో పంచుకున్నారు. అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం ఇచ్చే విధానంపై అమెరికా రేడియో వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్,చైనా వంటి దేశాలపై తీవ్ర విమర్శలు చేస్తూ,అవి నివసించడానికి అనర్హమైన దేశాలంటూ జాత్యహంకార ధోరణి ప్రదర్శించారు. ముఖ్యంగా భారత్,చైనా నుంచి గర్భిణీలు చివరి దశలో అమెరికాకు వచ్చి అక్కడే పిల్లలకు జన్మనిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదో నెలలోనే అమెరికాకు వచ్చి పిల్లలను కనడం ద్వారా,ఆ శిశువులకు అక్కడి చట్టాల ప్రకారం వెంటనే పౌరసత్వం లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
అమెరికాతో పాటు ముప్పైకి పైగా దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి
అనంతరం ఆ పిల్లల ఆధారంగా కుటుంబ సభ్యులను కూడా అమెరికాకు తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని 'బర్త్ టూరిజం'గా పేర్కొంటూ ప్రస్తుత చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. భారతీయులు, చైనా వారిపై కూడా అవమానకర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత వలస పరిస్థితులకు అమెరికా రాజ్యాంగం సరిపడదని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ తన వేదికలో పంచుకోవడం గమనార్హం. పుట్టుకతో పౌరసత్వం కల్పించే విధానం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని ఆయన ఇటీవల ఒక టెలివిజన్ ముఖాముఖిలో కూడా పేర్కొన్నారు. అయితే వాస్తవానికి అమెరికాతో పాటు కెనడా, మెక్సికో సహా ముప్పైకి పైగా దేశాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత్, చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు… మళ్లీ వార్తల్లో ట్రంప్
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) April 23, 2026
Donald Trump just posted content calling India a "hellhole"
In a clear racial attack, trump describes Indian and Chinese immigrants as "gangsters with laptops" who have "stepped on our flag"
Trump in his lengthy note was reacting to arguments in the US Supreme… pic.twitter.com/YazND9JBUw