Loading...
Xi Jinping: భారత్‌కు చైనా అధినేత షీ జిన్‌పింగ్‌.. సెప్టెంబర్‌లో కీలక పర్యటన!
భారత్‌కు చైనా అధినేత షీ జిన్‌పింగ్‌.. సెప్టెంబర్‌లో కీలక పర్యటన!

Xi Jinping: భారత్‌కు చైనా అధినేత షీ జిన్‌పింగ్‌.. సెప్టెంబర్‌లో కీలక పర్యటన!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో ఆయన న్యూఢిల్లీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశముందని సమాచారం. 2020లో భారత్‌-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన ఖరారైతే.. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన దేశంలో అడుగుపెట్టినట్లవుతుంది. ఆయన చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు.

వివరాలు 

భారత్‌కు 400 మంది అధికారులతో కూడిన చైనా ప్రతినిధి బృందం

ఆ తర్వాత తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ప్రస్తుతం పరిస్థితులను చక్కదిద్దే దిశగా రెండు దేశాలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ పర్యటన కీలకంగా మారనుంది.

ఈ పర్యటనలో భాగంగా సుమారు 400 మంది అధికారులతో కూడిన చైనా ప్రతినిధి బృందం భారత్‌కు రానున్నట్లు భారతీయ వర్గాలు వెల్లడించాయి.

సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి, ప్రాంతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాల అధికారులు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT